Pushkaralu : త్వరలో పుష్కరాలు...కుంభమేళా స్థాయిలో ఏర్పాట్లు

తెలంగాణలో త్వరలోనే పుష్కరాల ఘట్టం ప్రారంభమవ్వనుంది. వరుసగా గోదావరి, కృష్ణా, సరస్వతి నదులకు పుష్కరాలు రానున్నాయి. దీంతో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో  ముందుకెళ్తున్నది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 170 స్నానఘాట్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.

New Update
Pushkaralu

Pushkaralu

Pushkaralu : తెలంగాణలో త్వరలోనే పుష్కరాల ఘట్టం ప్రారంభమవ్వనుంది. వరుసగా గోదావరి, కృష్ణా, సరస్వతి నదులకు పుష్కరాలు రానున్నాయి. దీంతో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో  ముందుకెళ్తున్నది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 170 స్నానఘాట్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అందుకోసం బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్  రాగానే  అధికారులు పనులు ప్రారంభించనున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత ప్రతిపాదికన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహా కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దేవాదాయ, టూరిజం, పంచాయతీ రాజ్  శాఖలకు చెందిన పలువురు అధికారులు ఇటీవలే ప్రయాగ్ రాజ్ కు వెళ్లి కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించారు. 

Also read :  చావుకు వెళ్తే చచ్చేంత పనైంది.. శవాన్ని నడిరోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు!

అక్కడి అధికారులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. ఆ పర్యటనకు సంబంధించిన నివేదికను సీఎం కార్యాలయానికి పంపించినట్లు సమాచారం.  రాష్ట్రంలో ఈ ఏడాది మహా సరస్వతి పుష్కరాలు రానున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు మహా సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు  చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు సూచనలు ఇచ్చింది. పుష్కరాల ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు రూ.25 కోట్లు మంజూరు చేసింది. 

ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

2027లో గోదావరి, 2028లో కృష్ణా పుష్కరాలు రానున్నాయి. ఈ పుష్కరాలకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్  ప్రభుత్వం ప్రయాగ్ రాజ్ లో 45 రోజులపాటు విజయవంతంగా నిర్వహించిన మహా కుంభమేళాపై అధికారులతో ప్రభుత్వం సర్వే చేయించింది. రాష్ట్రం నుంచి ఎండోమెంట్, టూరిజం, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలకు చెందిన 10 మంది అధికారుల బృందం ఇప్పటికే ప్రయాగ్ రాజ్ లో పర్యటించింది. అక్కడి అధికారులతో మాట్లాడి కుంభమేళా ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన నివేదికను రాప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. యూపీ ప్రభుత్వం రెండేండ్ల ముందుగానే కుంభమేళా ఏర్పాట్లను ప్రారంభించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా నిర్వహించాలని చూస్తున్నది. ప్రభుత్వం నుంచి సిగ్నల్ రాగానే పుష్కరాలకు పనులు ప్రారంభించనున్నారు.

Also Read : ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

మూడేండ్లలో మూడు నదులకు పుష్కరాలు రానుండంతో అందకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరుసగా పుష్కరాలు వస్తుండంతో రాష్ట్ర్ంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనున్నది.

Also read :  తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains : మండుతున్న ఎండలకు కూల్‌ న్యూస్‌...నాలుగు రోజులు భారీవర్షాలు

ఎర్రటి ఎండలతో ఉక్కిరిబిక్కరవుతోన్న ప్రజలకు కూలింగ్‌న్యూస్‌. రానున్న నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. భూఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

New Update
ap rains

Heavy rains

Heavy rains : ఎర్రటి ఎండలతో ఉక్కిరిబిక్కరవుతోన్న ప్రజలకు కూలింగ్‌న్యూస్‌. రానున్న నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. భూఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
 ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుసంధానంగా ద్రోణి ప్రభావం కూడా ఉంది.

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల మీదుగా మరో ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని IMD తెలిపింది. వచ్చే నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశముంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశముంది. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

 మరోవైపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇచ్చింది. ఇక ద్రోణి ప్రభావంతో 2 నుంచి 4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షసూచన ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  

Also Read: Former Union Minster Girija Vyas:దేవుడి హారతి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైన మాజీ కేంద్ర మంత్రి

 తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లలో వడగండ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌ సహా మిగతా ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతాయని.. జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అటు ఏపీలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది.

Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు