Metro Rail: మెట్రో విస్తరణకు వ్యతిరేకం..హైకోర్టులో పిల్

హైదరాబాద్ మెట్రో విస్తరణకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏపీడబ్ల్యూఎఫ్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మెట్రో ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈవోలను ప్రతివాదులు గా చేర్చారు.

New Update
Old City Metro Rail

Old City Metro Rail

Metro Rail: హైదరాబాద్ మెట్రో విస్తరణకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఏపీడబ్ల్యూఎఫ్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్ మెట్రో ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈవోలను ప్రతివాదులుగా చేర్చారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చారిత్రక కట్టడాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణం చేపడుతున్నారని పేర్కొంటూ.. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై ఏపీడబ్ల్యూఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ఇది కూడా చదవండి: BRS : టార్గెట్ సీఎం రేవంత్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద స్కెచ్!

తెలంగాణ వారసత్వ చట్టం 2017 ప్రకారం.. చారిత్రక కట్టడాలను రక్షించాలని పేర్కొంది. పాతబస్తీ ప్రతిపాదిత మెట్రోమార్గం సమీపంలో చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, పురానా హవేలి, మొఘల్ పురా సమాధులు వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయని వివరించింది. మెట్రో రైలు నిర్మాణం కారణంగా ఈ స్మారక చిహ్నాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం తదుపరి పనులు చేపట్టే ముందు హైకోర్టు లేదా నిపుణుల బృందం ఆమోదం పొందాలని కోరింది. మెట్రో ప్రాజెక్టు డిజైన్‌ను తెలంగాణ హైకోర్టు లేదా సంబంధిత నిపుణుల బృందం చూసి.. పరిశీలించి ఆమోదించిన తర్వాత నిర్మాణంపై ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరింది.  అప్పటివరకు పనులను నిలిపివేయాలని ఏపీడబ్ల్యూఎఫ్ హైకోర్టును విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 17న హైకోర్టు ఈ విషయంపై తదుపరి విచారణకు ఆదేశిస్తూ వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!

హైదరాబాద్ మెట్రో మొదటి దశలో భాగంగా జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో మెట్రో రైలు నిర్మాణం పూర్తి కాలేదు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో మార్గంలో పాతబస్తీలో మెట్రో నిర్మించేందుకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ప్రాజెక్టు డిజైన్‌లో కొన్ని మార్పులు చేసిన తర్వాత.. ప్రస్తుతం ఆ మార్గంలో మెట్రో రైలు విస్తరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ మార్గంలో మెట్రో విస్తరణపై కొందరు హైకోర్టుకు ఎక్కారు. దీనిపై ఏపీడబ్ల్యూఎఫ్‌ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి: అల్లం టీలో రెండు పదార్థాలు కలిపి తాగండి... ఆ సమస్యల్ని పరార్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

భద్రాధ్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం జడ్ వీరభధ్రాపురంలో చేతబడి నెపంతో సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. తన బాబాయి కొమరం రాముడు చేతబడి చేయడం వల్లే తన ఇంట్లో వారు వరుసగా ఏదోకారణం చేత మృతిచెందుతున్నారని అనుమానం పెంచుకుని హత్య చేశాడు.

New Update
 A young man murdered his own uncle

A young man murdered his own uncle

 TG Crime :  ఖమ్మంలో అమానుష ఘటన జరిగింది. భద్రాధ్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం జడ్ వీరభధ్రాపురంలో చేతబడి నెపంతో సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. తన బాబాయి కొమరం రాముడు చేతబడి చేయడం వల్లే తన ఇంట్లో వారు వరుసగా ఏదోకారణం చేత మృతిచెందుతున్నారని అనుమానం పెంచుకున్న కొమరం వెంకటేష్.. సొంత బాబాయి కొమరం రాముడిని హత్యచేసేసేందుకు పథకం రచించాడు. గత నెల 11వతేదీన భార్య కొమరం లక్ష్మీదేవితో కలసి కొమరం రాముడు అదే గ్రామంలోని బంధువుల పెళ్లికి వెళ్లాడు.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!


 పథకం ప్రకారం మద్యం ఆశచూపి కొమరం రాముడిని గ్రామ శివారులోని చెరువు కట్టకు రప్పించాడు కొమరం వెంకటేష్. మద్యం మత్తులో ఉన్న కొమరం రాముడిని తన బామ్మర్థి బద్దం బాలరాజు సాయంతో వైరుతో గొంతునులిమి హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని గన్నీసంచిలో కూర్చి చెరువులో పడేశారు. అయితే పెళ్లికి తనతో వచ్చిన భర్త కనిపించకపోవడంతో అంతటా వెతికిన భార్యకు జాడ తెలియలేదు. దీంతో తన భర్త కనిపించడం లేదంటూ గత నెల 16వ తేదీన దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది భార్య కొమరం లక్ష్మీదేవీ. 

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు, కేసు నమోదు చేసిన మూడు వారాల్లో దుమ్ముగూడెం సీఐ అశోక్ మిస్సింగ్ కేసు మిస్టరీని చేధించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో  గ్రామస్థుల సాయంతో మృతుడు కొమరం రాముడి మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీయించారు.  మిస్సింగ్ కేసును హత్యకేసుగా మార్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం భధ్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు