Telangana: తెలంగాణలో నేడు భారీ వర్షాలు..ఎక్కడంటే!
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చారు. నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈనెల 8 వరకు ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చారు. నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈనెల 8 వరకు ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు.
నల్గొండ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కారణంగా మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ లో అస్వస్థతకు గురైయ్యారు. దుగ్యాల మోడల్ స్కూల్ లో 7 గురు బాలికలు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఐదుగురు బాలికలను రాత్రికి రాత్రే దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఉప సర్పంచ్ కు చెక్ పవర్ రద్దు.. ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీకి ఛాన్స్.. కలెక్టర్లకు సర్పంచ్ ను సస్పెండ్ చేసే అధికారం తొలగింపు.. లాంటి అనేక రూల్స్ ను తీసుకురానుంది రేవంత్ సర్కార్. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు తేవాలని భావిస్తోంది.
TG: రాష్ట్రంలో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
TG: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఖాళీగా ఉన్న 6 శాఖలు త్వరలో భర్తీ చేసే ఛాన్స్ ఉంది. మంత్రి పదవి రేసులో 10 మంది నేతలు ఉండగా.. అందులో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి హోంమంత్రి దక్కనున్నట్లు కాంగ్రెస్ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ఇంజిన్పైకి లేచింది. నాగలి మధ్య ఇరుక్కొని రైతు పెద్దగోని నర్సింహ(54) అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి కొణతం దిలీప్ ను అరెస్ట్ చేశారు. దిలీప్ అరెస్ట్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు.
భువనగిరిలో యువకుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ చదువుతున్న హాసినికి కొన్ని రోజులుగా నిఖిల్ అనే వ్యక్తి ఇన్ స్టాలో అసభ్యకర మెసేజ్ లు పంపుతూ వేధింపులకు గురిచేశాడని. ఇది తట్టుకోలేక హాసిని ఉరేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రలు ఆరోపిస్తున్నారు.