BIG BREAKING: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి!

హుజూర్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ కీలక నేత కస్తాల శ్రవణ్‌ చనిపోయారు. మంత్రి ఉత్తమ్ శ్రవణ్ మృతదేహంపై కాంగ్రెస్ జెండా ఉంచి నివాళులర్పించారు. బాధితుడి పిల్లల చదువు బాధ్యత తీసుకుంటానని.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.

New Update
Uttam Kumar Reddy

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అనుచరుడు, హుజూర్ నగర్ మున్సిపాలిటీ మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్‌ మరణించారు. నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన హుజూర్ నగర్ వెళ్లారు. శ్రవణ్‌ మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మృతుల పిల్లల చదువుకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని.. ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. నిన్న రాత్రి హుజూర్‌నగర్ కోర్టు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ ప్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ తీవ్ర గాయాల పాలయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను ఖమ్మంకు తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందారు. అయితే.. తలకు బలమైన గాయం కావడంతోనే శ్రవణ్ మరణించినట్లు తెలుస్తోంది.

స్టూడెంట్ యూనియన్, ఎమ్మార్పీఎస్ నేతగా పని చేసిన శ్రవణ్.. 2020 మున్సిపల్ ఎన్నికల్లో హుజూర్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన శ్రవణ్‌ కాంగ్రెస్ ఫ్లోర్‌ లీడర్‌గా నియమితులయ్యారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!

కరీంనగర్‌లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

New Update
Telangana Crime

Telangana Crime Photograph: (Telangana Crime )

భర్త, అత్త వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన హన్ముకొండలో చోటుచేసుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ పట్టణానికి చెందిన హిమబిందు(34)ను ఎల్కతుర్తి మండలానికి చెందిన శ్రీరామోజు రమేశ్​ చారికి ఇచ్చి 16 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఈ 16 ఏళ్ల నుంచి రమేశ్ శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

వేధింపులు భరించలేక..

ఎన్నో సార్లు గ్రామ పంచాయతీ వరకు వీరి గొడవ వెళ్లింది. అయినా కూడా రమేశ్ ప్రవర్తలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో హిమబిందు రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. మళ్లీ పంచాయితీ పెట్టి అత్తవారింటికి తీసుకొచ్చారు. మళ్లీ ఇంట్లో గొడవ జరగడంతో మనస్తాపం చెంది హిమబిందు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఇదిలా ఉండగా ఇటీవల వివాహం జరిగిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హాజీపూర్ మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన కంది కవిత- శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా చిన్న కూతురు శృతిని పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి గత నెల16న వివాహం జరిపించారు.

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత నుంచి భర్త సాయితో పాటు అత్త మామ లక్ష్మి, శంకరయ్య మానసికంగా ఇబ్బంది పెడుతూ పెళ్లికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయిందని ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుండి తేవాలని శ్రుతిని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీంతో ఆ నూతన వధువు బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

Advertisment
Advertisment
Advertisment