కొడుకుని మింగిన ఆన్ లైన్ బెట్టింగ్.. దారుణానికి పాల్పడ్డ తల్లి!

రంగారెడ్డి జిల్లాకి చెందిన అఖిల్‌రెడ్డి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ లో రూ.20 లక్షలు నష్టపోయాడు. దీంతో అప్పుల బాధ తట్టుకోలేక ఉరేసుకుని చనిపోయాడు. కుమారుడి మరణంతో తల్లి లూర్దమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

ఆన్ లైన్ బెట్టింగ్ లు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. లక్షల్లో బెట్టింగ్ లు ఆడి నష్టపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటనే తాజాగా జరిగింది. ఓ యువకుడు ఆన్లైన్ ట్రేడింగ్లో దాదాపు లక్ష రూపాయలు పెట్టాడు. లాభాలు వస్తాయని ఎంతో ఆశ పడ్డాడు. కానీ అది కాస్త బెడిసి కొట్టడంతో నష్టాలపాలయ్యాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణ వార్త విన్న తల్లి మనసు విలవిలలాడిపోయింది. దీంతో ఒక్కగానొక్క కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చదవండిః ఆన్ లైన్ బెట్టింగ్ కు రెండు కుటుంబాలు బలి..

హయత్‌నగర్‌ సూర్యనగర్‌ కాలనీ రోడ్డునంబరు-2లో తాటికొండ లూర్దమ్మ, శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు అఖిల్‌రెడ్డి(24). వీరంతా కలిసే జీవిస్తున్నారు. ఉద్యోగ రీత్యా అఖిల్ తండ్రి శ్రీనివాస్‌రెడ్డి సివిల్‌ కాంట్రాక్టర్‌. తల్లి లూర్దమ్మ సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పారామెడికల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అఖిల్‌ రెండేళ్ల క్రితం బీటెక్‌ పూర్తిచేశాడు. అప్పటి నుంచి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తున్నాడు. 

రూ.20 లక్షల మేర నష్టం

మొదట్లో అంతా బాగానే ఉన్నా.. కొన్నాళ్లుగా భారీగా నష్టపోతూ వస్తున్నాడు. సుమారు రూ.20 లక్షల మేర నష్టపోయాడు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. ఏం చేయాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. అనంతరం గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మధ్యాహ్న సమయంలో అతడి తల్లి ఫోన్‌చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ కాకపోయే సరికి.. అదే ఇంట్లో అద్దెకుంటున్న వారికి కాల్ చేసి మాట్లాడింది.

వారు వెళ్లి చూసేసరికి అఖిల్‌ ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. దీంతో ఒక్కగానొక్క కుమారుడి బలవన్మరణాన్ని తట్టుకోలేక తల్లి లూర్దమ్మ గురువారం అర్ధరాత్రి బాత్‌రూమ్‌ శుభ్రం చేసే కెమికల్ ని తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటా హుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Also Read :  రాహుల్‌ గాంధీకి బిగ్ షాక్.. ఆ కేసులో పుణె కోర్టు సమన్లు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Wine Shops Closed: మందుబాబులకు షాకింగ్​ న్యూస్.. వైన్​షాపులు, కల్లు దుకాణాలు బంద్- ఎప్పుడంటే!

మందు బాబులకు బ్యాడ్​ న్యూస్. హైదరాబాద్​లో వైన్​షాపులు, కళ్లు దుకాణాలు, బార్‌లు బంద్ కానున్నాయి.​ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12 ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు అన్ని షాపులు మూసివేయాలని నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

New Update
Wine Shops

wine shops closed in hyderabad

మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. మరొక్క రోజు ఆగితే.. మద్యం దుకాణాలన్నీ మూతపడనున్నాయి. ఒక్క మద్యం షాపులు మాత్రమే కాకుండా.. కళ్లు దుకాణాలు కూడా మూసేస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే. ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా నగర కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి

Wine Shops Closed in Hyderabad

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

హనుమాన్ జయంతి రోజున హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు అన్నీ క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 12 వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కల్లు షాప్‌లు, బార్‌లు కూడా మూసివేయాలని తెలిపారు. 

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు

ఈ ఆదేశాలు జంటనగరాల్లో అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కావున ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా హనుమాన్ జయంతి ఉత్సవాన్ని ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని తెలిపారు. కాగా ఇటీవల జరిగిన శ్రీరామ నవమి సందర్భంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా వైన్​షాపులను మూసేసిన విషయం తెలిసిందే. 

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

(wine-shops-closed | wine-shops-closed-in-telangana | wine-shops | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment