Most Wanted Cheater  : మోస్ట్ వాంటెడ్ చీటర్‌ అరెస్ట్..

కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, సైట్స్‌ను టార్గెట్‌ చేస్తూ ఇంటీరీయర్‌ డిజైనర్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న మోస్ట్‌ వాంటేడ్‌ చీటర్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన నోటోరియస్ చీటర్ పలాష్ పాల్ నారాయణ గూడ పోలీసులకు చిక్కాడు.

New Update
Most Wanted Cheater

Most Wanted Cheater

Most Wanted Cheater :కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, సైట్స్‌ను టార్గెట్‌ చేస్తూ ఇంటీరీయర్‌ డిజైనర్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న మోస్ట్‌ వాంటేడ్‌ చీటర్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన  నోటోరియస్ చీటర్ పలాష్ పాల్ నారాయణ గూడ పోలీసులకు చిక్కాడు.పలాష్‌ ఇంటీరియర్‌ డిడైనర్‌ పేరుతో పలువురిని మోసం చేయగా ఆయన గురించి గత కొంతకాలంగా పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో పలాష్‌ మోసలకు అడ్డుకట్టపడినట్లయింది.

ఇది కూడా చదవండి: తమలపాకులను నీటిలో మరిగించి తాగితే మీలో ఈ మార్పు గ్యారంటీ

పలాష్‌ ఇంటీరియర్ డిజైనర్ నంటూ పరిచయం చేసుకుంటాడు. తన మాటలతోనే మనుషులను బుట్టలో వేసుకుంటాడు. ఫేక్ వీడియోస్ చూపిస్తూ నమ్మిస్తాడు. నమ్మి చేతిలో డబ్బలు పెట్టామా ఇక కంటికి కనిపించడు. ఫోన్లలోనూ అందుబాటులో ఉండడు. అప్పుడు తెలుస్తోంది తాము మోసపోయామని. అలా అతడి మాయ మాటలు నమ్మి మోసపోయినవారు ఎందరో. కానీ ఇన్నాళ్లకు అతడి పాపం పండింది.ఎట్టకేలకు అరెస్ట్‌ అయి కటకటాలపాలయ్యాడు.  

పశ్చిమబెంగాల్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ నోటోరియస్ చీటర్ పలాష్ పాల్‌ను నారాయణ గూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, సైట్స్ టార్గెట్‌గా పలాశ్ మోసాలకు పాల్పడ్డాడు. ఇంటీరియర్ డిజైనర్‌నంటూ సైట్స్ ఎండ్ కన్స్ట్రక్షన్ ఓనర్స్‌కు తనను తాను పరిచయం చేసుకుని పరిచయం చేసుకుంటాడు. ఇంటీరియర్ డిజైన్స్ సంబంధించి ఫెక్ వీడియోస్ చూపించి వర్క్ చేస్తానంటూ అందినకాడికి డబ్బులు వసూలు చేశారు. తీరా డబ్బులు చేతిలో పడ్డాక ఓనర్స్ కాల్స్‌కు స్పందించడు. అంతేకాకుండా నిందితుడు పలాశ్ పాల్‌పై ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కేసుకు కూడా నమోదు అయ్యింది. మర్డర్ కేసు సంబంధించి కోర్ట్ పేషీలకు పలాశ్ హాజరుకాలేదు. దీంతో పలాశ్ పాల్‌పై ఎన్‌బీడబ్ల్యూ వారెంట్‌ను న్యాయస్థానం జారీ చేసింది.

Also read: Vijayanagaram: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్

పలాశ్ పాల్‌పై ఎస్ఆర్‌నగర్, నారాయణగూడా, శంషాబాద్, రాయదుర్గ్ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. నారాయణగూడలో నికిత్ రెడ్డి వద్ద కార్పెంటర్, వుడ్ వర్క్స్ కోసం అంటూ దాదాపు రూ.66 లక్షల వరకు వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్నాక వాట్సాప్, నార్మల్ కాల్ అందుబాటులో లేకపోవడంతో నిఖిత్ రెడ్డి అప్రమత్తమయ్యాడు. పలాశ్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతని అకౌంట్‌లో ఉన్న రూ. 18,65,000 బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. పలాశ్ పాల్‌ కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు.. చివరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పలాశ్ వద్ద నుంచి 120 గ్రాముల బంగారం, 40 వేల రూపాయల కాష్, పలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్, మొబైల్ ఫోన్స్‌‌ను పోలీసులు సీజ్ చేశారు.

Also read: jagga reddy: లవ్ స్టోరీలో హీరోగా జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్ అంటూ బాలయ్య రేంజ్‌లో

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Two rowdy sheeters : ఇద్దరు రౌడీషీటర్లపై నగర బహిష్కరణ వేటు

ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తూ సమాజానికి ప్రమాదకరమైన ఇద్దరు క్రిమినల్స్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ నగర బహిష్కరణ వేటు వేసింది. రాచకొండ కమిషనరేట్‌లో వారు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని  పోలీసు కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.

New Update
Two rowdy sheeters

Two rowdy sheeters

Two rowdy sheeters :   ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తూ సమాజానికి ప్రమాదకరమైన ఇద్దరు క్రిమినల్స్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ నగర బహిష్కరణ వేటు వేసింది. రాచకొండ కమిషనరేట్‌లో వారు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని  పోలీసు కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.

Also Read: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

పోలీసు కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.....రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ పై 19 కేసులు, నాలుగు హత్య కేసులున్నాయి.  మరిన్ని కేసుల్లో అనుమానితుడిగా, నిందితుడిగా ఉన్నాడు. మరో క్రిమినల్ సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోహిన్ 21 కేసులతో పాటు, హత్య, హత్యాయత్నాల కేసులలో అనుమానితుడిగా, నిందితుడిగా నమోదయ్యాడు. ఇద్దరు రౌడీషీటర్లపై సెక్షన్ 261 సిటీ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ  వేటు వేసినట్లు వివరించారు.

Also Read: America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్‌!

Also Read:  America Trump:ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయం: ట్రంప్!

 వీరు తీరు మార్చుకోక పోవడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వీరి చర్యలతో ప్రజలకు ఇబ్బందిగా మారడంతో ఈ ఇద్దరి పై ఆరు నెలల పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్ నుంచి బహిష్కరిస్తూ సీపీ సెక్షన్ సిటీ యాక్ట్ -261 ప్రకారం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరు రానున్న ఆరు నెలల కాలంలో కమిషనరేట్ పరిధిలో కనిపించిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. నగర బహిష్కరణ నిబంధనలను ఉల్లంఘించి కమిషనరేట్ పరిధిలో సంచరిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు.

Also Read: America: హుతీలను ఎలా చంపామో తెలుసా...వీడియో విడుదల చేసిన అగ్రరాజ్యం!

Also Read: America-Ukrain: ఏడు రోజుల్లో దేశాన్ని విడిచి పొండి...!

Advertisment
Advertisment
Advertisment