BREAKING: మాజీ సీఎం కేసీఆర్కు బిగ్ రిలీఫ్
TG: మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. 2011 రైల్ రోకో కేసుల్లో కేసీఆర్ పై విచారణకు హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది.
TG: మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. 2011 రైల్ రోకో కేసుల్లో కేసీఆర్ పై విచారణకు హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయి నేటితో వంద రోజులయ్యాయి. ఆమె బెయిల్ కోసం ప్రయత్నించినా అది ఫలించడం లేదు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇన్నిరోజులైనా కవితను చూడటానికి వెళ్లకపోవడం గమనార్హం.
TG: గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ కు హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-2, గ్రూప్-3కి ఉద్యోగాలు కలుపుతామన్న హామీ నిలుపుకోవాలని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి బకాయిలతో చెల్లించాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఏడాదిన్నర ఏళ్ల చిన్నారి గొంతులో గులకరాయిరాయి ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందింది. కడవేర్గు గ్రామానికి చెందిన జరీనాబేగం తన పిల్లల్ని తీసుకొని పుట్టింటి వెళ్లగా.. చిన్నకూతురు ఆడుకుంటూ గులకరాయి మింగడంతో ఈ ఘటన జరిగింది.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మరోసారి ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. మంత్రి సురేఖ హాజరైన బడిబాట కార్యక్రమంలో ప్రొటో కాల్ పాటించలేదని.. ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫైర్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకోవడంతో మంత్రి సురేఖ వెనుదిరిగారు.
మియాపూర్ నుండి పఠాన్ చెరు, సంగారెడ్డి వరకు మెట్రో రైల్ ను పొడిగించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీని కోరారు. ఈ రోజు సంగారెడ్డి బీజేపీ నేతలతో కలిసి మెట్రో రైల్ MDకి వినతి పత్రం అందించారు. గ్రౌండ్ రిపోర్ట్ ను వెంటనే తెప్పిస్తమని వారికి ఎండీ హామీ ఇచ్చారు.
జూన్ 23 వరకు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు యాదాద్రి భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 24న హుస్నాబాద్ వేదికగా 5వేల ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.