/rtv/media/media_files/2026/05/24/fire-accident-2026-05-24-17-31-16.jpg)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ క్యాంపు కార్యాలయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్యాంపు కార్యాలయంలో మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా మంటలు, పొగలు పైకి లేవడంతో అక్కడ ఉన్న సిబ్బంది, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బ్రేకింగ్ న్యూస్
— AshaPriya Mudiraj 🇮🇳 (@ashapriya09) May 24, 2026
ఈ డాక్యుమెంట్స్ కాలి పోతే ఎవరికి లాభం..?🤔
మేడిగడ్డ బ్యారేజీ దగ్గరున్న L&T కార్యాలయంలో అగ్ని ప్రమాదం. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు
కాలి బూడిదైనట్లు సమాచారం.
ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో… pic.twitter.com/VG7MctT7fA
అగ్నిమాపక శాఖకు సమాచారం
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రాజెక్టు సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం అసలు ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అలాగే ఈ ఘటనలో ఎంతవరకు ఆస్తి నష్టం సంభవించింది? అనే విషయాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు, అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు.
Follow Us