మల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు.. వారే చంపేశారంటూ రోగి బంధువులు..!

బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సూరారంలోని ఆస్పత్రిపై కేసు నమోదైంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మెదక్ జిల్లాకు చెందిన లక్ష్మీ మృతి చెందిందంటూ బాధితురాలి ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

author-image
By srinivas
New Update
Malla Reddy : టీడీపీ వైపు మాజీ మంత్రి మల్లారెడ్డి చూపు.. అధ్యక్ష పదవి కోసం!

Hyderabad : బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సూరారంలోని ఆస్పత్రిపై కేసు నమోదైంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మెదక్ జిల్లాకు చెందిన లక్ష్మీ మృతి చెందిందంటూ బాధితురాలి ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ ఇవ్వని మేజర్ సంస్థలు..కారణం ఏమై ఉంటుంది?

బ్రేన్​ సమస్యతో అడ్మిట్​ చేస్తే..

ఈ మేరకు మెదక్ జిల్లా రామాయంపేట ​మండలం సుతార్ పల్లికి చెందిన చిన్నవల్లోల్ల లక్ష్మి (48) అనారోగ్యంతో ఆగస్టు 31న మల్లారెడ్డి ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె బ్రేన్ సమస్య ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్​ చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు అంగీకరించగా ఆపరేషన్ చేశారు వైద్యులు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆపరేషన్ చేసిన మహిళా చనిపోవడం సంచలనం రేపింది. ఈ విషయాన్ని దాచిన వైద్య సిబ్బంది వెంటిలేటర్ ​పై ఉంచామంటూ డ్రామాలు మొదలుపెట్టారు. 

ఇది కూడా చదవండి: ఇవి తింటే బరువు తగ్గడం కన్ఫామ్‌

రిపోర్టులు ఇవ్వకుండా కాగితాలపై సంతకాలు..

అంతటితో ఆగకుండా బిల్లులు వసూల్ డ్రామా మొదలుపెట్టారు. మొదటి దశలో రూ.25 వేలు తీసుకున్నారు. సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు ఆపరేష్​ ప్రారంభించి, సాయంత్రం 6 గంటలకు పూర్తి చేశామంటూ సెప్టెంబర్ 9న రూ.78 వేలు చెల్లించి మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బ్రేయిన్ స్ట్రోక్ వస్తే ఇంత ఆసల్యంగా ఎందుకు చెబుతున్నారని బాధిత కుటుంబసభ్యులు నిలదీశారు. రిపోర్టులు ఇవ్వకుండా కాగితాలపై సంతకాలు తీసుకుని లక్ష్మిని తీసుకెళ్లడానికి అనుమతించారు. అంబులెన్స్ లో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో లక్ష్మి చనిపోవడంతో అసలు గుట్టు బయటపడింది.

ఇది కూడా చదవండి: Food Poisoning: నారాయణపేటలో ఘోరం.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత

లక్ష్మీని స్వగ్రామానికి తీసుకెళ్లి ఖననం చేసిన అనంతరం లక్ష్మీ కూతురు అశ్విని సూరారం పోలీసులకు నవంబర్ 18న ఫిర్యాదు చేసింది. వైద్యులు ఆపరేషన్ చేసిన రోజే తన తల్లి చనిపోగా వెంటిలేటర్ పై ఉంచి తమను మభ్యపెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: గౌతమ్ అదానీకి అరెస్ట్ వారెంట్.. అతని అల్లునిపై కూడా..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bhubharathi Portal : రేపే భూభారతి పోర్టల్ ఆరంభం..ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు

రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూభారతి అమలుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

New Update
Bhubharathi Portal

Bhubharathi Portal

Bhubharathi Portal : రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది.రాష్ట్రంలో భూభారతి పోర్టల్‌ను తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.భూభారతి అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్‌ను రేపు జాతికి అంకితం చేయబోతున్నట్లు తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్ధమయ్యేలా భూభారతిని రూపొందించాలని అధికారులకు సూచించారు. భూభారతి తాత్కాలికం కాదని.. కనీసం వంద సంవత్సరాల పాటు ఉంటుందని అన్నారు. భూభారతి వెబ్‌సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయత సంస్థకు అప్పగించాలని చెప్పారు.కాగా పోర్టల్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు.  

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

భూ స‌మ‌స్యల ప‌రిష్కారం, లావాదేవీల‌కు చెందిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతికి చెందిన పలు అంశాలను అధికారులకు ఆయన సూచించారు. ఈ పోర్టల్​ ను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మూడు మండలాల్లో పైలట్​ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా స‌ద‌స్సుల్లో ప్రజ‌ల నుంచి వ‌చ్చే సందేహాలను నివృత్తి చేయాలో అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూ భారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండ‌లంలోనూ క‌లెక్టర్ల ఆధ్వర్యంలో స‌ద‌స్సులు నిర్వహించాల‌ని సీఎం ఆదేశించారు.

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

 ప్రజలు, రైతుల‌కు అర్ధమ‌య్యేలా, సుల‌భ‌మైన భాష‌లో పోర్టల్ ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ బ‌లోపేతానికి ప్రజ‌ల నుంచి వ‌చ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తూ ఎప్పటిక‌ప్పుడు అప్‌డేట్ చేయాలని సీఎం అధికారుల‌కు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాల‌ని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ కార్యద‌ర్శి జ్యోతి బుద్ద ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన  

 రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ ప్రజల పాలిట శాపంగా మారిందని, భూ లావాదేవీలన్నింటినీ ఆన్​లైన్​ ద్వారా నిర్వహించేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ సామాన్య ప్రజలకు ఇబ్బందులను తెచ్చిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం విమర్శలు చేసింది. భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల నుంచి ధరణి పోర్టల్‌లో ఎక్కించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తింది. దీంతో 20 లక్షలకు పైగా రైతులు ధరణి పోర్టల్‌ కారణంగా ఆగమయ్యారని ఆరోపించింది.

Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

 

Advertisment
Advertisment
Advertisment