Local Body Elections : పది పరీక్షల తర్వాతే స్థానిక ఎన్నికలు...ఎందుకంటే..

తెలంగాణలో స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసి ఏడాది కావస్తోంది. ప్రస్తుతం పదవతరగతి పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అంటోంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జయసింహ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

New Update
Local Body Elections

Local Body Elections

Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసి ఏడాది కావస్తోంది.అయినా ఎన్నికల నిర్వహణపై క్లారిటీ రాలేదు. అప్పుడు ఇప్పుడు అంటూ చెప్పడం తప్ప ఒక తేదిని మాత్రం ప్రకటించలేదు. అయితే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అదే సమయంలో అవసరమైన అధికారులకు శిక్షణ కూడా ఇస్తోంది. అయితే ప్రస్తుతం పదవతరగతి పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అంటోంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జయసింహ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్‌కు ప్రధానమైన పదవ తరగతి, ఇంటర్ పరీక్షల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని కోరారు.
Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
 
స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు విద్యాభ్యాసంపై ప్రభావం పడుతుందని,  దీంతో వారు ఏకాగ్రత కోల్పోయి  తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నదని సంఘం నాయకులు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు ముగిశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అలాగే గత ఐదేండ్లలో గ్రామపంచాయతీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి, వాటి తాలూకు బిల్లులు అందక సర్పంచ్‌లు ఆర్థికంగా కుదేలైపోయారని అన్నారు. వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి, ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతూ వినతి పత్రం అందించారు.

Also Read: మాఘి పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో కొత్తగా మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలివే

ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు ఆయా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించకుండా వారిపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సర్పంచులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఎన్నికలయ్యాక మాట మార్చడం సరికాదన్నారు. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి, ఎస్సీ వర్గీకరణలో తగు న్యాయం చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

Also Read: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!

Also Read: పారిస్ ఏఐ సమ్మిట్‌.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ

Advertisment
Advertisment
Advertisment