మంత్రి కొండా సురేఖ కీలక సమీక్ష

నిజామాబాద్ జిల్లాలో వరద నష్టంపై మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు.

New Update
Minister Konda Surekha Nizamabad Review

నిజామాబాద్ జిల్లాలో వరద నష్టంపై మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

ఎల్కతుర్తి సభలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ మాట్లాడిన మాటలపై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. అధికారం పోయిన అక్కసులో కేసీఆర్ నోటికొచ్చింది మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మీ కూతురు పెద్ద కార్లలో తిరుగుతుంటే మా బిడ్డల్లో బస్సుల్లో కూడా తిరక్కూడదాని ప్రశ్నించారు. 

New Update
MLA Seethakka: పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్పా..!!

కెసిఆర్ ఎవరు కోసం బాధపడుతున్నారు.. కేవలం అధికారం పోయింది అన్న బాధ తప్ప...ఆయన కుటుంబంలో చీలికలు బజారున పడుతున్నాయన్న బాధ కేసీఆర్ ఇసుమంతైనా లేదని మంత్రి సీతక్క విమర్శించారు. మీ కూతురు పెద్దపెద్ద కార్లలో తిరుగుతారు.. కానీ ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే కూడా ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళ మనుషులను పంపించి గొడవలు చేస్తున్నారంటే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దరిద్రమని అత్యంత నీచంగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఉచిత ప్రయాణం వల్ల ప్రతి మహిళకు మూడు నాలుగు వేలు ఆదా అవుతుంది .

నియంత వచ్చి కన్నీరు కారుస్తున్నారు..

అధికారులు బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు చేయించి 100% మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినట్టు సంతకాలు చేసుకున్నావు. మేము గ్రామాల్లో బోర్లను రిపేర్ చేయించాము.. కొత్త సోర్సులను కూడా మిషన్ భగీరథ కోసం సృష్టిస్తున్నాం. ప్రతి ఏటా వందల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథను మెరుగుపరుస్తున్నాము. మీలాంటి వారు రైతుల ఆత్మహత్యలు గురించి మీరు మాట్లాడితే విడ్డూరంగా ఉంది అంటూ సీతక్క కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.  మీ హయాంలో ఐదువేల రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పత్రికల్లో వచ్చాయి. నువ్వు మీ ఫామ్ హౌస్ లో ఒక ఎకరంలో కోటి రూపాయల పంట పండించావు... ఆ కిటుకు ప్రజలకు ఎందుకు వివరించలేదు అంటూ సీతక్క దుయ్యబట్టారు.  ఆడబిడ్డలకు బస్ ఇస్తే నచ్చదు.. 500 వేల గ్యాస్ ఇస్తే నచ్చదు. పేద కుటుంబాలకు ఇల్లు ఇస్తే నచ్చడం లేదు.  నిరుద్యోగులకు ఉద్యోగాలకు కల్పిస్తే నష్టం లేదు . 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కానీ  విద్యుత్ సంస్థలకు 60 వేల కోట్ల బకాయిలు పెట్టిన చరిత్ర కేసీఆర్ ది అని సీతక్క విమర్శించారు.  

ఒక నియంత వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరు. మీరు అలా ఉండి మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మేమే నియంతలమైతే ఈరోజు మీ భ జరిగి ఉండేదా. ప్రజాస్వామ్య హక్కు అందరికీ ఉంటుందని సభ సజావుగా సాగాలని ప్రభుత్వం సహకరించింది...కేసీఆర్ అది గమనించాలని సీతక్క మాట్లాడారు. మేము సభకు అనుమతిస్తే ముసలి కన్నీరు కారుస్తున్నావు.  నీకు అధికారం పోయేసరికి ఆ బాధలో ఉండి మాట్లాడుతున్నావ్.  అధికారం పోగానే అసెంబ్లీకి రానీ నువ్వు ఒక నాయకుడివా..అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరఫున మాట్లాడే వారే నిజమైన నాయకులు అని సీతక్క అన్నారు. అధికారం పోయింది అన్న బాధ తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే ఒక వాస్తవాన్ని ఆయన మాట్లాడలేదు. 
అధికారం పోయిన తర్వాత ఒక నియంత దొంగ ఏడుపు ఏడిస్తే ఎలా ఉంటుందో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసిఆర్. ఆయన ప్రసంగంలో పస లేదని సీతక్క విమర్శించారు. 

 today-latest-news-in-telugu | kcr | brs | minister | minister-sitakka 

Also Read: బ్యాగ్‌లో బాంబ్- విమానంలో ‘అల్లా హు అక్బర్’ అంటూ భయపెట్టిన వ్యక్తి!

Advertisment
Advertisment
Advertisment