/rtv/media/media_files/2025/03/26/KyytuDHWBpJklhiF1fw4.jpg)
komatireddy-r-gopal
హోంశాఖ అంటే తనకు ఇష్టమని తాను అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తనకు హోంశాఖ అయితే బాగుంటుందని తన అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లుగా మీడియాతో చెప్పాను అంతే కానీ తనకు హోంశాఖ కావాలని కోరలేదన్నారు. మంత్రి పదవులు ఇచ్చే విషయంలో శాఖల కేటాయింపు విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని.. అధిష్టానం తనను గుర్తించి మంత్రివర్గంలో చోటు కల్పించి ఏ శాఖ అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.
ఏ శాఖ అప్పగించినా పనిచేస్తా
మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలనే విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అవుతుందని.. ఈరోజు అసెంబ్లీలో కొంతమంది మీడియా మిత్రులు ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి, శాఖల కేటాయింపు ఎలా ఉంటుందని విషయంలో చిట్ చాట్ చేసిన సందర్భంలో చెప్పడం జరిగింది. మా కార్యకర్తలు, అభిమానులు నాకు హోం శాఖ మంత్రి అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారని, అంతేతప్ప నాకు హోం శాఖ ఇవ్వాలి, హోం మంత్రి అయితేనే బాగుంటుంది అనే విషయాలు మీడియా మిత్రుల వద్ద చర్చకు రాలేదు.. మంత్రి పదవులు ఇచ్చే విషయంలో శాఖల కేటాయింపు విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్... అధిష్టానం నన్ను గుర్తించి మంత్రివర్గంలో చోటు కల్పించి ఏ శాఖ అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేసి ఇటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి, అటు ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి అహర్నిశలు పాటుపడుతూనే ఉంటా అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
PRESS NOTE -
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) March 25, 2025
మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలనే విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అవుతుందని.. ఈరోజు అసెంబ్లీలో కొంతమంది మీడియా మిత్రులు ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి, శాఖల కేటాయింపు ఎలా ఉంటుందని విషయంలో చిట్ చాట్ చేసిన సందర్భంలో…
Also Read : ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?
MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్కు బిగ్ షాక్.. మూడు కేసులు నమోదు!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు బిగ్షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్పై మంగళ్హాట్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.
mla-rajasingh cases
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు బిగ్షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్పై మంగళ్హాట్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. శోభాయాత్రలో రాజాసింగ్ మాట్లాడుతూ ఉండగా.. భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతూ.. భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. ఈ క్రమంలో భక్తులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపిస్తే..లాఠీలకు మేమూ పని చెప్తామంటూ రాజాసింగ్ కామెంట్స్ చేశారు. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
ఇక ఇదే శోభాయాత్రలో ఓవైసీ బ్రదర్స్పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు. ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్ కీలక కామెంట్స్ చేశారు.
ముస్లింలకు వ్యతిరేకం కాదు
వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని 9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు.
Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!
Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్స్ ఎగుమతి
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!
పిల్లల్ని వదిలేసి వానితో లేచిపోయిన బాగుండు.. రజితను ఎన్కౌంటర్ చేయండి : చెన్నయ్య
USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు
Stock Markets: చైనాపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..