TG News: ఖమ్మంలో ఘోర ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి వాగులో పడిన ట్రాలీ.. 25 మంది!

భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 25 మంది వ్యవసాయ కూలీలతో వెళుతున్న టాటాఏసీ.. టైర్ పేలడంతో బ్రిడ్జి పైనుంచి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో పదిమందికి తీవ్రగాయాలవగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Bhadradhri Kothagudem district

Bhadradhri Kothagudem district

TG News:  ఖమ్మం భద్రాధ్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పెద్దవాగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 25 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న టాటాఎసీ వాహనం వాగులోకి పడిపోయింది. టైర్ పేలడంతో అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి వాగులోకి పడిపోయినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో పదిమందికి తీవ్రగాయాలు అవగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: Ap Weather: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో నాలుగు రోజులు వానలే..వానలు!

మరో విషాదం.. 

ఇదిలా ఉంటే ఖమ్మంలో  మరో విషాదం చోటుచేసుకుంది. ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామానికి చెందిన సరోజమ్మకు ఈ నెల 20న ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నెహ్రూ నగర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు గుండె సమస్య ఉందని స్టెంట్ వేశారు. కానీ ఆ తర్వాత అనుకోని విధంగా ఆమెను మృత్యువు వెంటాడింది. ఆపరేషన్ అనంతరం లిఫ్ట్ లో  జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు లిఫ్ట్ ఫెయిల్ అయ్యి కింద పడిపోయింది.  దీంతో అప్పుడే  ఆపరేషన్‌ చేయించుకున్న సరోజ గాయాలతో  మృతి చెందింది. 

telugu-news | khammam | bhadradri-kothagudem 

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: ఖమ్మంలో విషాదం.. నీటిలో మునిగి తండ్రీ కుమారుడు మృతి

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడులో చెరువులో పడిన తండ్రిని కాపాడబోయి కుమారుడు మృతి చెందాడు. మృతులు పఠాన్ యూసుఫ్ మియా (65), కుమారుడు కరీముల్లాగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
crime khammam

crime khammam

TG Crime: ఖమ్మం జిల్లాలో పండగపూట తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో పడిన తండ్రిని కాపాడబోయి కుమారుడు కూడా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామంలో పఠాన్ యూసుఫ్ మియా (65)కి మతిస్థిమితం లేదు. ఇంటి సమీపంలోని ఊర చెరువులోకి దిగాడు. నీటిలో మునిగిపోతున్న తండ్రిని గమనించిన కుమారుడు కరీముల్లా తండ్రిని కాపాడుదామని చెరువులోకి దిగాడు.

కాపాడే ప్రయత్నం చేసినా..


ఇది కూడా చదవండి: పసుపు రంగు డ్రాగన్ ఫ్రూట్ తిన్నారా?..ఎన్నో ప్రయోజనాలు

అయితే గతంలో చెరువులో ప్రోక్లైన్ల ద్వారా పెద్ద పెద్ద గోతులు తీసి మట్టిని తరలించారు. దీంతో లోతును అర్థం చేసుకోలేక కుమారుడు కూడా తండ్రితో పాటే చనిపోయాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. తర్వాత తండ్రీ కుమారుల మృతదేహాలను వెలిసి తీశారు. రంజాన్‌ పర్వదినాన ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. యూసుఫ్ మియాకు భార్య ముగ్గురు కొడుకులు. కరీముల్లాకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నల్గొండలో దారుణం.. భార్యను గొంతుకోసి చంపిన భర్త!

( ts-crime | ts-crime-news | latest-news)

Advertisment
Advertisment
Advertisment