/rtv/media/media_files/2025/03/25/iZFeNtA5FBMMlOlp667c.jpg)
Bhadradhri Kothagudem district
TG News: ఖమ్మం భద్రాధ్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పెద్దవాగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 25 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న టాటాఎసీ వాహనం వాగులోకి పడిపోయింది. టైర్ పేలడంతో అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి వాగులోకి పడిపోయినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో పదిమందికి తీవ్రగాయాలు అవగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also Read: Ap Weather: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో నాలుగు రోజులు వానలే..వానలు!
మరో విషాదం..
ఇదిలా ఉంటే ఖమ్మంలో మరో విషాదం చోటుచేసుకుంది. ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామానికి చెందిన సరోజమ్మకు ఈ నెల 20న ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నెహ్రూ నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు గుండె సమస్య ఉందని స్టెంట్ వేశారు. కానీ ఆ తర్వాత అనుకోని విధంగా ఆమెను మృత్యువు వెంటాడింది. ఆపరేషన్ అనంతరం లిఫ్ట్ లో జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు లిఫ్ట్ ఫెయిల్ అయ్యి కింద పడిపోయింది. దీంతో అప్పుడే ఆపరేషన్ చేయించుకున్న సరోజ గాయాలతో మృతి చెందింది.
telugu-news | khammam | bhadradri-kothagudem
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్