Bhadrachalam: ఫోన్‌ పేలో లంచం.. ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన CI

భద్రచలం సీఐ రమేష్ లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గ్రావెల్స్‌ తవ్వకానికి అనుమతి ఇవ్వాలంటే రూ.30వేలు డిమాండ్ చేశాడు. రూ.20వేలు బేరం కుదుర్చుకున్నాడు. బాధితుడి దగ్గర నుంచి గన్‌మెన్‌కు ఫోన్ పే చేయించుకున్నాడు. అలా CI రమేష్ ACBకి చిక్కాడు.

New Update

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ అధికారి అవినీతి నిరోధక శాఖ ఆఫీసర్లకు పట్టబడ్డాడు. భద్రాచలం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమేష్ గురువారం లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాడెండ్‌గా చిక్కాడు. సీఐ రమేష్ గ్రావెల్ తవ్వకాల కోసం రూ.30 వేల లంచం డిమాండ్ డిమాండ్ చేశాడు. బాధితుడికి లంచం ఇవ్వడం ఇష్టం లేదు. లంచం ఇస్తేనే గ్రావెల్ తవ్వకాలకు అనుమతి అంటూ బాధితుడిని సీఐ బెదిరించాడు.  అతికష్టం మీద రూ.20 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Also read: Vinesh Phogat: హర్యానా బీజేపీ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ MLA వినేష్ ఫొగట్‌కు రూ.4 కోట్లు

గన్‌మెన్‌ రామారావు ద్వారా మూడో వ్యక్తికి ఫోన్‌ పే చేయాలని బాదితుడికి చెప్పారు. బాదితుడితో పోలీసుల కాల్ రికార్డింగ్స్, ఫోన్‌ పే హిస్టరీ వివరాలు కూడా ఉన్నాయి. ఆ ఎవిడెన్స్‌తో బాదితుడు ఏసీబీ అధికారులకు సంప్రదించాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగి సీఐ, అతని సిబ్బందిని విచారించారు. మొదటి నుంచి రమేష్‌పై అవినీతి అభియోగాలు ఉన్నాయని డిపార్ట్‌మెంట్‌లో చెప్పుకుంటున్నారు.  భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సీఐ రమేష్‌పై ఆరోపణలు ఉన్నాయి.

Also read: రేప్ కేసులో ట్విస్ట్.. అంతా ఆమె ఇష్టపూర్వకంగానే జరిగిందని నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Khammam: భట్టి Vs పొంగులేటి.. ఖమ్మంలో హైటెన్షన్!

ఖమ్మం జిల్లా పాల్వంచలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దమ్మతల్లి పాలకమండలి ప్రమాణ స్వీకారంలో భట్టి, పొంగులేటి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ గ్రామానికి పాలకమండలిలో చోటుకల్పించలేదంటూ కేశవాపురం యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. 

New Update
khammam

khammam Photograph: (khammam)

Khammam: ఖమ్మం జిల్లా పాల్వంచలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దమ్మతల్లి పాలకమండలి ప్రమాణ స్వీకారంలో భట్టి, పొంగులేటి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ గ్రామానికి పాలకమండలిలో చోటుకల్పించలేదంటూ కేశవాపురం యువకులు  పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. 

Also Read: Jwala Gutta :పండంటి పాపకు జన్మనిచ్చిన స్టార్‌ క్రీడాకారిణి గుత్తాజ్వాల!

భారీగా మోహరించిన పోలీసులు..

ఈ క్రమంలోనే పాలకమండలి ప్రమాణస్వీకారాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తూ ఆలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకోగా.. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ప్రమాణస్వీకారం చేశారు పాలకమండలి సభ్యులు.

Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..?

మొదట డిప్యుటీ సీఎం భట్టివిక్రమార్క అనుచరుడు జమ్ముల రాజశేఖర్ ను ఆలయ చైర్మన్ గా నియమిస్తూ సభ్యులతో కూడిన నియామకపత్రం విడుదల చేసింది దేవాదాయ ధర్మాధాయ శాఖ. అయితే ఇటీవల పాలకమండలిలో చోటు దక్కించుకుని ప్రమాణ స్వీకారానికి సిద్ధమైంది పొంగులేటి వర్గం. అయినప్పటికీ నూతన పాలకమండలి జాబితాలో తమ గ్రామానికి చోటుకల్పించకపోవడంపై కేశవాపురం గ్రామస్థులు కొద్దిరోజులుగా ఆందోళనకుదిగారు. తమ గ్రామంలో వెలసిన అమ్మవారి ఆలయ పాలకమండలిలో ఊరికి అవమానం జరిగిందంటూ నిరసనలు చేప్టటారు. ఇందులో భాగంగానే ఈరోజు పాలకమండలి ప్రమాణస్వీకారాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయినప్పటికీ తీవ్ర ఉద్రిక్తతల నడుమ భారీ బందోబస్తుతో పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయ పాలకమండలి ప్రమాణస్వీకారం ముగిసింది. 

Also Read: 'కింగ్‌డమ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్‌ లోడింగ్..!

Also Read: Ex Dgp Murder Case: గూగుల్‌ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

palvancha | batti | ponguleti | temple | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు