KCR: ఫామ్ హౌజ్ లో బెంజ్ కారు నడిపిన కేసీఆర్.. వీడియో వైరల్!

కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎర్రవెళ్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ స్వయంగా బెంజ్ కారు నడిపి అలరించారు. పట్లోల్ల కార్తీక్ రెడ్డిని పక్కన కూర్చో బెట్టుకొని తన పంటల గురించి వివరించారు. ఫొటో, వీడియో వైరల్ అవుతున్నాయి.

author-image
By srinivas
New Update
 dfdr

KCR Drive Car: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్.. మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. పార్టీనేతలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ప్రజల సమస్యలపై స్పందిస్తూ అండగా నిలుస్తున్నారు.

కార్తీక్ రెడ్డిని పక్కన కూర్చో బెట్టుకొని..

ఈ క్రమంలోనే ఆదివారం గజ్వేల్‌లోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పాలకుర్తి నియోజకవర్గం నేతలతో సమావేశమైన కేసీఆర్.. అనంతరం స్వయంగా బెంజ్ కారు నడుపుతూ కనిపించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు పట్లోల్ల కార్తీక్ రెడ్డిని పక్కన కూర్చో బెట్టుకొని కారు నడిపిన కేసీఆర్.. ఫామ్ హౌస్‌లో పండిస్తున్న పంటల గురించి కార్తీక్ రెడ్డికి వివరించినట్లు సన్నిహితులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: Swiggy- Zomato: త్వరలో స్విగ్గీ, జొమాటాలో కొత్త సేవలు

ఇక కేసీఆర్ కారు నడిపిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. టైగర్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి కేసీఆర్ కారు జోరు ఎవరు డ్డుకోలేరంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపిన సంగతి తెలిసిందే. కాగా డాక్టర్ల సూచనతో ఒంటరిగా వ్యాన్‌లో ఫామ్ హౌస్ లో కలియతిరిగారు. 

ఇది కూడా చదవండి: నీవు ఒక దొంగ.. తెలంగాణ నిన్ను మరిచిపోయింది: కేసీఆర్ కు రేవంత్ కౌంటర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bhadrachalam Temple : భద్రాద్రి రామయ్యకు"ప్రభుత్వ" కానుక..ఆనాటి నుంచే…..

భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకులకు ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ ఆనావాయితీ నిజాం పాలన నుంచే అంటే 1890లలో ఆరో నిజాం కాలం నుంచి కొనసాగుతోంది.

New Update
Bhadrachalam Temple

Bhadrachalam Temple

Bhadrachalam Temple : భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకులకు ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఆనావాయితీ ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన తర్వాత నుంచే వస్తుందనుకుంటారు. కానీ నిజానికి దీనికి 135 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. అంటే నిజాం పాలన నుంచే ఆ ఆచారం కొనసాగుతోంది. 1890లలో ఆరో నిజాం కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
 
భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. మిథిలా మండపంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రతి ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు. నిజాం కాలం నుంచే మత సామరస్యానికి ప్రతీకగా.. భద్రాచలం రాములవారి కల్యాణానికి సర్కార్ నుంచి కానుకలు అందేవి. 1890లలో హైదరాబాద్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి బృందం ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ తరపున భద్రాచలం ఆలయానికి కానుకలు సమర్పించారు. ఈ సంప్రదాయం కుతుబ్ షాహీలతో ప్రారంభమై నేటికీ తెలంగాణ ప్రభుత్వం ద్వారా కొనసాగుతోంది. 

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి నిజాం నవాబులు కానుకలు అందించిన చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు కూడా ఉన్నాయి. నిజాం రాజవంశం, ముఖ్యంగా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన దాతృత్వంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా నిలిచారు. ఆయన మత విశ్వాసాలకు అతీతంగా హిందూ, ముస్లిం దేవాలయాలకు, ఇతర సంస్థలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు. భద్రాచలం ఆలయానికి సంబంధించి నిజాం రాజులు ఈ పుణ్యక్షేత్రాన్ని గౌరవించారు. ఆలయ నిర్వహణకు ఆర్థిక సహాయం కూడా అందించారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భద్రాచలం ఆలయానికి రూ. 29,999 విరాళంగా ఇచ్చినట్లు తెలిసింది. ఈ సొమ్ము ఆ కాలంలో చాలా ఎక్కువ అని దాన్ని ఆలయ అభివృద్ధికి ఉపయోగించినట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అంతేకాకుండా భక్త రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న ప్రజాధనాన్ని రాములవాడి దేవాలయ నిర్మాణానికి వెచ్చించి గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానాషా చేత ఖైదు చేయబడినప్పుడు శ్రీరాముడు, లక్ష్మణుడు రామదాసుకు రుణం తీర్చడానికి రామముద్రలతో బంగారు నాణేలు అందించారని పురాణ కథనం ఉంది. ఈ సంఘటన తర్వాత, తానాషా రామదాసును విడుదల చేసి ఆలయానికి గ్రామాలను దానం చేసినట్లు చెబుతారు. ఈ గ్రామాల ఆదాయం ఆలయ నిర్వహణకు ఉపయోగపడింది. ఆ తర్వాత కాలంలో నిజాం రాజులు భద్రాచలం ఆలయం చుట్టూ ఉన్న భూముల ద్వారా ఆలయ అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెట్టినట్లు ఆధారాలు ఉన్నాయి. అలా మొదలైన ఈ ఆనవాయితీ ఉమ్మడి రాష్ర్టంలోనూ కొనసాగింది. తెలంగాణ వచ్చిన తర్వాత నేటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment