Telangana Rains : తెలంగాణలో నేడు వర్షాలు.. వాతావరణశాఖ కీలక ప్రకటన!

మంగళవారం నాడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని తెలిపారు.

author-image
By Bhavana
New Update
ap rains

Telangana Rains : రెండు రాష్ట్రాల్లో 15 రోజుల క్రితం భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు విపరీతంగా పడ్డాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జలాశయాలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఈ క్రమంలోనే వర్షాలు, వరదలకు తెలంగాణంలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతాలకుతలం అయ్యాయి. మొత్తం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. 

10 వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. అయితే గత వారం రోజులుగా వరుణుడు కొంచెం బ్రేక్ ఇచ్చాడు. అయితే మంగళవారం నాడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని తెలిపారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తక్కువగానే ఉన్నా.. పలు జిల్లాల్లో మాత్రం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు నిపుణులు తెలిపారు.

తెలంగాణలో పలు జిల్లాల్లో చిరు జల్లులు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీస్తాయన్నారు.

Also Read: మరోసారి రికార్డ్ ధర పలికిన బాలాపూర్ లడ్డూ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment