By- Elections : వాళ్లేం సుద్దపూసలు కాదు..ఉప ఎన్నికలొస్తే తగ్గేదేలే...కడియం కామెంట్స్‌

ఎమ్మెల్యేల అనర్హత పిటిషిన్‌పై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈనెల 10వ తేదిన తీర్పు రాబోతుందని చెప్పారు. కోర్టు తీర్పును తప్పకుండా పాటిస్తామని, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా బరిలో ఉంటానన్నారు.

New Update
Rajaiah Vs Kadiyam Srihari

Rajaiah Vs Kadiyam Srihari

Bye Elections ఎమ్మెల్యేల అనర్హత పిటిషిన్‌పై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. ఈనెల 10వ తేదిన తీర్పు రాబోతుందని చెప్పారు. కోర్టు తీర్పును తప్పకుండా పాటిస్తామని.. అందులో వెనక్కి పోయేదిలేదన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా బరిలో ఉంటానని స్పష్టం చేశారు.'బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలు చేస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిది. ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. అప్పట్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు సుద్దపూసల్లాగా మాట్లాడుతున్నారు. ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదు. గులాబీ పార్టీ చేస్తే సంసారం.. వేరే పార్టీ చేస్తే వ్యభిచారమా?' అని కడియం శ్రీహరి ప్రశ్నించారు.

ఇది కూడా చూడండిPakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి :  పాక్ ప్రధాని

'ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కేటీఆర్ సంతోషపడుతున్నారు. అక్కడ ఆప్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్. లిక్కర్ స్కాంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. దీనికి కారణం బీఆర్ఎస్‌తో స్నేహం చేయడమే. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్- కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుండేది. కేజ్రీవాల్ అతిగా ఊహించుకుని ఒంటరిగా వెళ్లడంతో ఓటమి చవి చూశారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీకి అవకాశం ఉండేది కాదు' అని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో
 
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇటీవల అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీకి నోటీసులు పంపించారు. అయితే.. కేసీఆర్‌ కూడా ఆనాడు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు.. వాళ్లను అప్పుడు డిస్‌క్వాలిఫై చేశారా.. అని నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. న్యాయ నిపుణులతో చర్చించి.. తగు నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.

కాగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం కక్ష సాధింపు చర్యలు, కుట్ర రాజకీయాలు చేస్తున్నాడన్నారు.. టీడీపీలో ఉన్నప్పుడు అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు చేశారని దుయ్యబట్టారు. దౌర్జన్యాలు చేస్తూ ఎందరినో ఎన్‌కౌంటర్లు చేయించాడు. ఈ ఆరు నెలల్లో ఏడుగురిపై అక్రమ కేసులు పెట్టించాడు. స్టేషన్ ఘనపూర్ ప్రజలను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తాడని కడియంను గెలిపించారు.. ఇప్పుడు బీఆర్ఎస్‌కు అక్కరకురాని వాడయ్యాడని మండిపడ్డారు. కుక్కిన పేనులా ఉండకుండా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితలను తిడుతున్నాడు.. కడియం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా, నైతిక విలువలు లేకుండా గెలిచిన పార్టీకి, పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారాడు.. తగదునమ్మా అని అభివృద్ధి కోసం అంటూ కల్లబొల్లి మాటలు చెప్తున్నాడు.. 13 నెలలు అయింది, ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని కడియం శ్రీహరిని విమర్శించారు. 

Also Read: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?


అయితే రాజయ్య మాటలను కడియం ఖండించారు.చేతగానివారు, చేవలేని, అవినీతి పరులు ఇప్పుడు మాట్లాడు తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఘనపూర్ నియోజకవర్గానికి నిధులు వచ్చాయి.. ఘనపూర్‌ను మున్సిపాలిటీ చేసుకున్నామని అన్నారు. రూ.800 కోట్ల నిధులకు ఉత్తర్వులు వచ్చాయి.. మరో 200 కోట్లకు ఉత్తర్వులు రావాలని తెలిపారు. మొత్తంగా 13 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే ఘనపూర్‌కు రూ.1000 కోట్ల నిధులు వచ్చాయని చెప్పారు. ఎవరెన్ని మాట్లాడినా నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని కడియం శ్రీహరి అన్నారు. రాజయ్య 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి.. పదేళ్లు ప్రభుత్వం ఉన్నప్పటికీ చిన్న చిన్న పనులు కూడా చేయలేక పోయారని ఆరోపించారు. ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజలకు ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సహకారం కోసం పార్టీ మారానని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Also Read: ఢిల్లీ బీజేపీ మాజీ సీఎంలు వీళ్లే..  ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు