హైదరాబాద్‌లో ఇన్ని చెరువులు కబ్జా అయ్యాయా?

హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపించడం ప్రారంభించాక చెరువులు, కుంటల కబ్జాల బాగోతం బయటపడుతోంది. తెలంగాణ రాకముందే 225 చెరువులు కనుమరుగైపోగా రాష్ట్రం వచ్చాక మరో 44 మాయమైపోయినట్లు భట్టి విక్రమార్క చెప్పారు.

New Update
LAKES

HYDRA: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు కబ్జా చేసిన కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రాకు చట్టబద్దత కలిపిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ఓ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందే 225 చెరువులు కనుమరు అయిపోయాయని..  రాష్ట్రం వచ్చాక మరో 44 మాయమైపోయాయని అన్నారు. ఇదిలా ఉంటే అసలు హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉండేవి.. ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయనే చర్చ యావత్ తెలంగాణ తో పాటు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాల ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. 

మొత్తం 396 చెరువులు స్వాహా...

రాజధాని పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయన్న దానిపై రిమోట్‌ సెన్సింగ్‌ ఇచ్చిన వివరాలు ప్రకారం.. బాహ్యవలయ రహదారి పరిధిలో మొత్తం 920 చెరువులు ఉండగా వాటిలో తెలంగాణ రాకముందు అంటే 2014 నాటికే 225 చెరువులు కబ్జాకు గురయ్యాయని తేలింది. అందులో 695 మాత్రమే మిగిలాయని పేర్కొంది. మరోవైపు 2014 నుంచి ఇప్పటివరకు అంటే గత పదేళ్లలో 44 పూర్తిగా, 127 పాక్షికంగా ఆక్రమణలకు గురైనట్లు లెక్కలు చెబుతున్నాయి.

1970లో 4,150 చెరువులు.. 

హెచ్‌ఎండీఏ పరిధిలో 4,150 వరకు చెరువులు, కుంటలు ఉండేవని నీటిపారుదల శాఖ లెక్కల్లో తేలినట్లు సమాచారం. అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం 3,000 ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హెచ్‌ఎండీఏ రికార్డుల్లో కేవలం 2000 వరకే చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో శాఖ వద్ద ఒక్కో తరహా లెక్కలు ఎందుకు ఉన్నాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా దీన్ని నిర్ధారించుకునేందుకు హైడ్రా అధికారులు సర్వే ఆఫ్‌ ఇండియా సాయం తీసుకుంటున్నారు. దసరా తరువాత హైడ్రా మరింత దూకుడుగా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.

Also Read :  దసరా వేళ తప్పిన భారీ ప్రమాదం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం ఆయసంతో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు ఎక్స్పైరీ అయిన ఇంజక్షన్‌ను ఇచ్చారు. అది వికటించడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

New Update
Injuction

Expired Injuction

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజక్షన్ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ అసలేం జరిగిందో తేలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్‌రోడ్డు సమీపంలో హైకేర్‌ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

ఆ తర్వాత వైద్యులు అతడికి పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అక్కడున్న వైద్యులు తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని సూచనలు చేశారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఐలయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇలా ఎలా జరిగిందని వైద్యులను నిలదీశారు. 

Also Read: పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

చివరికి ఐలయ్యకు ఇచ్చిన ఇంజక్షన్లను పరిశీలించారు. అయితే ఆ ఇంజక్షన్ మార్చి నెలలోనే ఎక్స్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిసినప్పటికీ కూడా ఇంజక్షన్ ఇవ్వడం ఏంటని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఐలయ్య మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహంతోనే ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా ఇలా ఇంజక్షన్‌లు వికటించి రోగులు మృతి చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

Also Read: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్‌లో పదిమంది!

rtv-news | telangana 

Advertisment
Advertisment
Advertisment