BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

HCU భూవివాదంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. తక్షణమే చెట్లు నరికివేతను ఆపివేయాలని ఆదేశించింది. ఓ నిపుణులు కమిటి వేసి.. పూర్తి నివేదిక సమర్పించాలని సూచించింది. ఈ కేసులో సీఎస్‌ను ప్రతివాదిగా చేర్చింది.

New Update
SC on HCU land

SC on HCU land Photograph: (SC on HCU land)

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూవివాదంలో సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. HCU భూవివాదంపై దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టులో విచారించింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చురకలు అంటించింది. జస్టిస్ గవాయ్ రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్ లపై ప్రశ్నల వర్షం కురింపించారు. 400 వందల ఎకరాల భూవివాదంపై నెల రోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. ఆ కమిటీ ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని కోరింది. నెమళ్లు, జింకలు, పక్షులకు ఆవాసమైన అటవి ప్రాంతంలో చెట్లను ఎందుకు తొలగించారని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది.  సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ మధ్యంతర నివేదికను పంపారు.

Also read: BIG BREAKING: HCU భూముల వ్యవహారం.. రేవంత్ సర్కార్‌కు హైకోర్టు బిగ్ షాక్

100 ఎకరాల్లో అడవిని నాశనం చేశారని సుప్రీం కోర్టుకు రిపోర్ట్ అందింది. చెట్ల నరికివేతను సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టామని న్యాయమూర్తి తెలిపారు. 400 ఎకరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీం కోర్టు ప్రతివాదిగా చేర్చింది. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణం జరిగినా.. పూర్తి బాధ్యత సీఎస్‌దే అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అంత అర్జెంట్‌గా డిఫారెస్టేషన్ పనులు మొదలుపెట్టాల్సిన అవసరమేంటని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని సుప్రీం కోర్టు నిలదీసింది. ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని తెలిపింది. తమ ప్రశ్నలకు సీఎస్‌ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.

Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్‌ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు!

తెలంగాణ టెన్త్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గ్రేడింగ్‌ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. దీంతో మెమోల ముద్రణ ఎలా ఉండాలనే దానిపై స్పష్టత రావట్లేదట. అది తేలితేనే ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. 

New Update
tg 10th

TG 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గ్రేడింగ్‌ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. దీంతో మెమోల ముద్రణ ఎలా ఉండాలనే దానిపై స్పష్టత రావట్లేదట. అది తేలితేనే ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. 

రేవంత్ సర్కార్ GO జారీ..

ఈ మేరకు గత ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన గ్రేడింగ్‌ విధానానికి స్వస్తి చెప్పి మార్కులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ GO జారీ చేసింది. అయితే మార్కులకు సంబంధించిన మెమోల ముద్రణపై ఇప్పటికే మంతనాలు జరపగా దీనిపై తుది నిర్ణయం వెలువడలేదట. దీంతో మెమోల జారీ అశం తేలితేనే రిజల్ట్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం కూడా  పూర్తి కాగా.. ఏప్రిల్ చివరి వారం వరకు ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారట. ఈ లోగా ప్రభుత్వం నుంచి మెమోలా అంశంపై స్పష్టమైన ప్రకటన రాకపోతే మరింత ఆలస్యం అవుతుందని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. 

NCERT ప్రతిపాదన..

ఇదిలా ఉంటే.. గతంలో మోమోలపై ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి, ఫెయిల్‌ అని రాసేవారు. కానీ ఇప్పుడు పాస్, ఫెయిల్‌ అని ఇస్తే చాలని NCERT సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ప్రథమ మార్కులు సాధించినవారిని ప్రోత్సహించేలా ఫస్ట్, సెకండ్, థర్డ్‌ క్లాస్‌ అని ఇవ్వాలని, 35 మార్కుల కన్నా తగ్గితే ఫెయిల్‌ అని రాయాలని ప్రభుత్వానికి ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు ప్రతిపాదించారట. దీనిపై నెల గడుస్తున్నా ప్రభుత్వం జవాబు ఇవ్వకపోవడతో NCERT అధికారులు సచివాలయానికి వెళ్లి విద్యాశాఖ అధికారులను ఆరా తీసినట్లు సమాచారం. 

Also read :  Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

మరోవైపు గ్రేడింగ్‌ విధానమే కొనసాగించాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. మార్కులు ప్రవేశపెడితే ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తామని ట్రస్మా తరఫున వినతిపత్రాలు అందినట్లు యాదగిరి శేఖర్‌రావు తెలపడం చర్చనీయాంశమైంది. కానీ 10వ  తరగతి గ్రేడింగ్‌ విధానం 2024 నవంబరులోనే ప్రభుత్వం ఎత్తివేసింది. ఇంటర్నల్ 20 మార్కులు ఉంటాయని తెలిపింది. కానీ ఇంటర్నల్ మార్క్స్ తొలగిస్తే ఫలితాల్లో మార్కులు తగ్గే అవకాశం ఉందని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. 

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

10th-class-results | telangana | memo | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment