Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెడ్ అలర్ట్

జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం యావత్తు వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘావర్గాలు రెడ్ అలెర్ట్ ప్రకటించాయి.

New Update
Shamshabad Airport

Shamshabad Airport

Shamshabad Airport : జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం యావత్తు వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. 

ఇది కూడా చదవండి :ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఇద్దరు పిల్లల్ని విసిరేసి చంపిన తల్లి


 గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘా వర్గాలు రెడ్ అలెర్ట్ ప్రకటించాయి. కాగా నేటి నుంచి ఈ నెల 30 వరకు ఎయిర్ పోర్ట్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. 

ఎయిర్‌ పోర్టులో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించినందున ఈనెల 30 వరకు ఎయిర్ పోర్ట్కు సందర్శకులు ఎవరు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ఆస్కారం ఉండటంతో పాటు అల్లరిమూకలు చెలరేగే ప్రమాదం పొంచి ఉందన్న నిఘావర్గాల ముందస్తు హెచ్చరికతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సీఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఇది కూడా చదవండి :బస్సు కోసం అడిగితే ఎత్తుకెళ్ళి రేప్ చేశారు..బెంగళూరు టెర్రర్

ఎయిర్‌ పోర్టుకు వెళ్లే మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు. ప్రయాణీకులతో ఎయిర్ పోర్ట్‌కు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అన్ని రకాల వాహనాలను ఆపి తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. కాగా ప్రయాణీకులకు వీడ్కొలు పలుకేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే సందర్శకులకు అధికారులు అనుమతి నిరాకరించారు.  అనుమానితులు, అనుమానిత వస్తువులు, అనుమానిత వాహనాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Asaduddin Owaisi: 'వాళ్లని వదలొద్దు'.. ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. యూరీ, పుల్వామా కన్నా ఇది తీవ్రంగా ఖండించదగిన దాడి అంటూ వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

New Update
Asaduddin Owaisi

Asaduddin Owaisi

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 28 మంది పర్యాటకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. యూరీ, పుల్వామా కన్నా ఇది తీవ్రంగా ఖండించదగిన దాడి అంటూ వ్యాఖ్యానించారు. ఈ దాడిలో మరణించినవారి బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Also Read: 15 ఏళ్ళు...11 దాడులు..227 మంది మృతి..జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల విధ్వంసం

'' నిన్న పహల్గాంలో జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కేంద్రం శిక్షిస్తుందని ఆకాంక్షిస్తున్నాం. మృతుల కుటుంబాలకు అండగా నిలబడుతాం. ఈ దాడిలో గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని కోరుతున్నాం. ఈ ఉగ్రదాడి.. యూరీ, పుల్వామా కన్నా తీవ్రంగా ఖండించదగినది. ఈసారి ఉగ్రవాదులు ప్రజలను టార్గెట్‌ చేసి కాల్పులు జరిపారు. ఇదొక నరమేధమని'' అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 

Also Read: ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గులు వీరే.. ఫొటోలు విడుదల చేసిన అధికారులు

ఇదిలాఉండగా.. పహల్గాంలోని బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడికి 'ది రిసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 6 నుంచి 8 మంది ఉగ్రవాదులు సైనిక దూస్తుల్లో వచ్చి పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డారు. వాళ్లు ఏకే 47, ఏకే 56 గన్‌లతో టూరిస్టులను కాల్చేశారు. ఈ భీకర దాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మరోవైపు ఈ దాడికి కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సర్జికల్ స్ట్రైట్‌కు ప్లాన్ వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. సర్జికల్ ​స్ట్రైక్​కు సిద్ధం !

Also Read:  ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో..ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?

 telugu-news | rtv-news | asaduddin-owaisi హైదరాబాద్ | తెలంగాణ

Advertisment
Advertisment
Advertisment