New Ration Card: ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం రూ.50కి మించి వసూలు చేయొద్దంటూ మీసేవ సెంటర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రూ.50కి బదులు ఏకంగా రూ.2వేలు వసూలు చేస్తున్నారు.

New Update
ration card

ration card

New Ration Card: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పేరుతో కొన్ని మీసేవ సెంటర్లు దందాలు మొదలుపెట్టేశాయి.   కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం రూ.50కి మించి వసూలు చేయొద్దంటూ మీసేవ సెంటర్లను తెలంగాణ ప్రభుత్వం(Telangana) ఆదేశించింది. అదనంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రూ.50కి బదులు ఏకంగా రూ.2వేలు వసూలు చేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ అధికంగానే దండుకుంటున్నారు. 

Also Read :  Chiranjeevi: ఎంత మాటన్నావ్ చిరు.. స్టేజీపైనే మెగాస్టార్ బూతులు: నెటిజన్ల ట్రోలింగ్

మళ్లీ దరఖాస్తు అక్కర్లేదు

వెంటనే ఈ దోపిడీపై అధికారులు ఫోకస్ పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాల్లో  రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ ధరఖాస్తు చేయాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కుటుంబ సభ్యులందరి ఆధార్‌‌‌‌ కార్డులు, ఇంటి కరెంట్​బిల్లు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది.  కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటుగా పాత రేషన్  కార్డుల్లో మార్పుల కోసం కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

Also Read :  Odisha Govt: అదిరిపోయిందిగా : ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం .. పెళ్లికి ముందు ఆ కౌన్సెలింగ్!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో దాదాపుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కూడా సంవత్సరం పాటూ ఇవ్వలేదు. తాజాగా జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమానికి స్వీకారం చుట్టింది.  అయితే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం టైమ్ లిమిట్ అంటూ ఏమీ లేదని  ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెబుతోంది.  

Also Read :  IND vs ENG : నేడు ఇంగ్లండ్తో టీమిండియా మూడో వన్డే.. ఆ ఇద్దరు ఔట్ !

Also Read :  Liquor Door Delivery: ఏపీలో వైన్ డోర్ డెలివరీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Elevator accident : హైదరాబాద్ లో మరో లిప్టు ప్రమాదం...ఒకరి మృతి

హైదరాబాద్‌ నగరంలోని సూరారంలో లిఫ్ట్‌ ప్రమాదం జరిగింది. సూరారంలోని సాయి మణికంఠ రెసిడెన్సీలో లిఫ్ట్‌ మీద పడటంతో అక్బర్‌ పాటిల్‌ (39) అనే వ్యక్తి మృతిచెందాడు. అపార్ట్‌మెట్‌ లిఫ్ట్‌ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది

New Update
Elevator accident

Elevator accident

Elevator accident :హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది.నగరంలోని సూరారంలో లిఫ్ట్‌ ప్రమాదం జరిగింది. సూరారంలోని సాయి మణికంఠ రెసిడెన్సీలో లిఫ్ట్‌ మీద పడటంతో అక్బర్‌ పాటిల్‌ (39) అనే వ్యక్తి మృతిచెందాడు. అపార్ట్‌మెట్‌ లిఫ్ట్‌ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్‌ పడటంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!


ఇదిలా ఉండగా.. ఇటీవల అలాంటి ఘటనే మరొకటి మెహదీపట్నంలో చోటు చేసుకుంది. ఆసిఫ్‌నగర్‌ ఠాణా పరిధి సంతోష్‌నగర్‌కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించడం స్థానికంగా విషాదం నింపింది. ఈ ఘటన ఈ ఏడాది మార్చి 15న చోటు చేసుకుంది. దుర్ఘటనపై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. శ్యామ్‌ బహదూర్‌ నేపాల్‌కు చెందిన వ్యక్తి. ఉపాధి కోసం ఏడు నెలల కిందట నగరానికి వచ్చాడు. ఆరు అంతస్తులున్న భవనంలో హాస్టల్‌ నిర్వహిస్తున్నారు. లిఫ్ట్‌పక్కనే ఉన్న చిన్నగదిలో శ్యామ్‌ బహదూర్‌ కుటుంబం ఉంటోంది. రాత్రి 10 గంటల టైంలో.. సురేందర్‌ ఆడుకుంటూ లిఫ్ట్‌ దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలో తలుపుల మధ్యకు వెళ్లగా.. పైన ఎవరో లిఫ్ట్‌ నొక్కారు. తలుపులు మూసుకుపోకముందే లిప్ట్‌ పైకి దూసుకెళ్లింది. దీంతో లిఫ్ట్‌లోనే ఆ పసిప్రాణం నలిగిపోయింది. ఇది మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

ఇది కూడా చూడండి:  AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

Advertisment
Advertisment
Advertisment