Hyderabad: హైదరాబాద్ లో విషాదం.. కుక్కతో ఆడుకుంటూ మూడో ఫ్లోర్ నుంచి..!

హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఉన్న వివి ప్రైడ్‌ హోటల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కతో ఆడుకుంటూ ఉదయ్‌ అనే వ్యక్తి మూడో అంతస్తు పైనుంచి పడి మృతి చెందాడు. ఈ ఘటనలపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
uday

Hyderabad

TG News : హైదరాబాద్‌లోని చందానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కుక్క తరమడంతో ఓ యువకుడు హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు.  అయితే ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుక్కతో ఆడుకుంటుండగా బ్యాలెన్స్‌ తప్పి ఉదయ్‌ కిందపడ్డాడు.

సీసీ కెమెరాలో విజువల్స్‌..

దీనికి సంబంధించిన వీడియోలు సీసీటీవీ కెమెరాలో విజువల్స్‌ రికార్డయ్యాయి. ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేందుకు హోటల్‌కు ఉదయ్‌ వెళ్లాడు. అక్కడ కుక్కతో ఆడుకునే క్రమంలో అదుపు తప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఉదయ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

 

Also Read :  ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎక్కడంటే?

స్థానిక వివరాల ప్రకారం.  తెనాలికి చెందిన ఉదయ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి రామచంద్రపురం అశోక్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సరదాగా స్నేహితులతో గడిపేందుకు చందానగర్‌లోని వివి ప్రైడ్‌ హోటల్లో రూమ్ తీసుకున్నారు. అయితే మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న కుక్కతో ఆడుకుంటూ.. అంటూ ఇటూ పరిగెత్తాడు. ఆ క్రమంలో ఉదయ్.. హోటల్ మూడో అంతస్తు బాల్కనీ నుంచి కింద పడ్డాడు. అయితే ఘటనపై  కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అన్నమయ్య జిల్లాలో విషాదం.. బస్సు ఢీకొని ఐదుగురు మృతి

తీవ్ర గాయాలైన ఉదయ్‌ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు  వెల్లడించారు. ఉదయ్‌ మరణించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అంతేకాకుండా ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మూడో ఫ్లోర్‌కి కుక్క ఎలా వెళ్ళింది.. అనేదానిపైన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని.. పరిస్థితిని ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: పిల్లలకి ఏ వయసులో ఏ టీకా వేయించాలి?

వరుస ఘటనలు:

నిన్న కోతులు తరమడంతో తప్పించుకొనే క్రమంలో కిందపడి ఓ మహిళ దుర్మరణం చెందింది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యానగర్‌లో  ఉన్న బొంగోని లక్ష్మి తన ఇంటి రేకుల షెడ్డుకింద ఉండగా కోతులమంద వచ్చింది. ఆమె అదిలించగా అవి బెదిరించాయి. వాటి బారి నుంచి తప్పించుకొనేందుకు ఇంట్లోకి పరుగుతీసే క్రమంలో ఆమె జారిపడి సిమెంట్‌ గచ్చుపై పడిపోయింది.  తల వెనుక భాగంలో బలమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. మృతురాలికి భర్త, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.

Also Read :  నాగార్జునకు తప్పిన ప్రమాదం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bhubharathi Portal : రేపే భూభారతి పోర్టల్ ఆరంభం..ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు

రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూభారతి అమలుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

New Update
Bhubharathi Portal

Bhubharathi Portal

Bhubharathi Portal : రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది.రాష్ట్రంలో భూభారతి పోర్టల్‌ను తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.భూభారతి అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్‌ను రేపు జాతికి అంకితం చేయబోతున్నట్లు తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్ధమయ్యేలా భూభారతిని రూపొందించాలని అధికారులకు సూచించారు. భూభారతి తాత్కాలికం కాదని.. కనీసం వంద సంవత్సరాల పాటు ఉంటుందని అన్నారు. భూభారతి వెబ్‌సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయత సంస్థకు అప్పగించాలని చెప్పారు.కాగా పోర్టల్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు.  

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

భూ స‌మ‌స్యల ప‌రిష్కారం, లావాదేవీల‌కు చెందిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతికి చెందిన పలు అంశాలను అధికారులకు ఆయన సూచించారు. ఈ పోర్టల్​ ను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మూడు మండలాల్లో పైలట్​ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా స‌ద‌స్సుల్లో ప్రజ‌ల నుంచి వ‌చ్చే సందేహాలను నివృత్తి చేయాలో అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూ భారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండ‌లంలోనూ క‌లెక్టర్ల ఆధ్వర్యంలో స‌ద‌స్సులు నిర్వహించాల‌ని సీఎం ఆదేశించారు.

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

 ప్రజలు, రైతుల‌కు అర్ధమ‌య్యేలా, సుల‌భ‌మైన భాష‌లో పోర్టల్ ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ బ‌లోపేతానికి ప్రజ‌ల నుంచి వ‌చ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తూ ఎప్పటిక‌ప్పుడు అప్‌డేట్ చేయాలని సీఎం అధికారుల‌కు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాల‌ని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ కార్యద‌ర్శి జ్యోతి బుద్ద ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన  

 రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ ప్రజల పాలిట శాపంగా మారిందని, భూ లావాదేవీలన్నింటినీ ఆన్​లైన్​ ద్వారా నిర్వహించేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ సామాన్య ప్రజలకు ఇబ్బందులను తెచ్చిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం విమర్శలు చేసింది. భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల నుంచి ధరణి పోర్టల్‌లో ఎక్కించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తింది. దీంతో 20 లక్షలకు పైగా రైతులు ధరణి పోర్టల్‌ కారణంగా ఆగమయ్యారని ఆరోపించింది.

Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

 

Advertisment
Advertisment
Advertisment