మియాపూర్ లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దారుణ హత్య!

మియాపూర్‌ లో బండి స్పందన (29) అనే సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో ఆమెను విచక్షణారహితంగా పొడిచినట్లు తెలుస్తుంది.కానీ అక్కడ ఎలాంటి ఆయుధం లభించలేదని పోలీసులు తెలిపారు.

author-image
By Bhavana
New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Hyderabad : మియాపూర్‌ లో ఓ వివాహితను పదునైన ఆయుధంతో ఆమె ఇంట్లోనే హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. ఏసీపీ నరసింహారావు, సీఐ దుర్గారామలింగ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం..దీప్తిశ్రీనగర్‌ సీబీఆర్‌ ఎస్టేట్‌ 3 ఏ బ్లాక్‌ లో ఉండే ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ఉపాధ్యాయురాలు నమ్రత కుమార్తె బండి  స్పందన (29) సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగినిగా వర్క్‌ చేస్తుంది. 

ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే అదే కాలనీకి చెందిన వినయ్‌ అనే వ్యక్తిని ప్రేమించి 2022లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అతను ఓ ప్రైవేట్‌ కంపెనీలో అకౌంటెంట్‌. సంవత్సరం తరువాత భర్త తనను వేధిస్తున్నాడంటూ మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి విడాకులకు అప్లై చేసింది. దీంతో ఆ కేసు కోర్టులో ఉంది.

సోమవారం స్పందన తల్లి పాఠశాలకు వెళ్లగా..స్పందన ఇంట్లో ఉంది. కాగా మధ్యాహ్నాం  సమయంలో ఆ ఇంటికి దగ్గరలో ఉండే వీరి బంధువు ఒకామె వచ్చి తలుపు కొట్టినప్పటికీ ఎవరూ తీయకపోవడంతో ఆమె తిరిగి వెళ్లిపోయింది. సాయంత్రం స్కూల్‌ నుంచి తిరిగి వచ్చిన తల్లి కాలింగ్‌ బెల్‌ నొక్కినప్పటికీ స్పందన తలుపు తీయలేదు.దీంతో ఆమె స్పందన మొబైల్‌ కి ఫోన్‌ చేసింది. అయినప్పటికీ ప్రయోజనం లేదు.

దీంతో ఆమె చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగలకొట్టి చూడగా ఆమె రక్తపు మడుగులో శవమై ఉంది. పదునైన ఆయుధంతో ఆమెను విచక్షణారహితంగా పొడిచినట్లు తెలుస్తుంది. కానీ అక్కడ ఎలాంటి ఆయుధం లభించలేదని పోలీసులు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నామని ఏసీపీ తెలిపారు. అపార్ట్‌మెంట్ తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Also Read: ఆసుపత్రిలో చేరిన సూపర్‌ స్టార్ !

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Two rowdy sheeters : ఇద్దరు రౌడీషీటర్లపై నగర బహిష్కరణ వేటు

ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తూ సమాజానికి ప్రమాదకరమైన ఇద్దరు క్రిమినల్స్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ నగర బహిష్కరణ వేటు వేసింది. రాచకొండ కమిషనరేట్‌లో వారు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని  పోలీసు కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.

New Update
Two rowdy sheeters

Two rowdy sheeters

Two rowdy sheeters :   ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తూ సమాజానికి ప్రమాదకరమైన ఇద్దరు క్రిమినల్స్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ నగర బహిష్కరణ వేటు వేసింది. రాచకొండ కమిషనరేట్‌లో వారు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని  పోలీసు కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.

Also Read: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

పోలీసు కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.....రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ పై 19 కేసులు, నాలుగు హత్య కేసులున్నాయి.  మరిన్ని కేసుల్లో అనుమానితుడిగా, నిందితుడిగా ఉన్నాడు. మరో క్రిమినల్ సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోహిన్ 21 కేసులతో పాటు, హత్య, హత్యాయత్నాల కేసులలో అనుమానితుడిగా, నిందితుడిగా నమోదయ్యాడు. ఇద్దరు రౌడీషీటర్లపై సెక్షన్ 261 సిటీ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ  వేటు వేసినట్లు వివరించారు.

Also Read: America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్‌!

Also Read:  America Trump:ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయం: ట్రంప్!

 వీరు తీరు మార్చుకోక పోవడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వీరి చర్యలతో ప్రజలకు ఇబ్బందిగా మారడంతో ఈ ఇద్దరి పై ఆరు నెలల పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్ నుంచి బహిష్కరిస్తూ సీపీ సెక్షన్ సిటీ యాక్ట్ -261 ప్రకారం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరు రానున్న ఆరు నెలల కాలంలో కమిషనరేట్ పరిధిలో కనిపించిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. నగర బహిష్కరణ నిబంధనలను ఉల్లంఘించి కమిషనరేట్ పరిధిలో సంచరిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు.

Also Read: America: హుతీలను ఎలా చంపామో తెలుసా...వీడియో విడుదల చేసిన అగ్రరాజ్యం!

Also Read: America-Ukrain: ఏడు రోజుల్లో దేశాన్ని విడిచి పొండి...!

Advertisment
Advertisment
Advertisment