Telangana: సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ లకు హైకోర్టులో భారీ ఊరట!

తెలంగాణలో కీలక పరిణామలు చోటుచేసుకున్నాయి.  2020 మార్చిలో నార్సింగిలో సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. సైఫాబాద్‌ పీఎస్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
ktr and rr

Telangana: తెలంగాణలో కీలక పరిణామలు చోటుచేసుకున్నాయి.  2020 మార్చిలో నార్సింగిలో సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.  జన్వాడలో డ్రోన్‌ ఎగురవేశారని రేవంత్‌రెడ్డితో పాటుగా పలువురిపై కేసు నమోదైంది.  2020మార్చిలో రేవంత్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు నార్సింగి పోలీసులు. 2020 మార్చిలో ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌ చేయాలని రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.  జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదన్నారు రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది.  రేవంత్‌రెడ్డిపై తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటూ న్యాయవాది వాదించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసును కొట్టివేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.  

Also read :  ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి .. బడ్జెట్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

Also read :  ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ ..  కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్‌!

కేటీఆర్‌పై నమోదైన కేసును సైతం

అలాగే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన కేసును సైతం హైకోర్టు కొట్టివేసింది.  సీఎం రేవంత్‌రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని కేటీఆర్‌పై సైఫాబాద్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.  ఎంపీ అనిల్‌ కుమార్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సైఫాబాద్‌ పోలీసులు. కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు కేటీఆర్‌.  సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని పీపీ వాదించగా..  రాజకీయ కక్షలతో కేసు నమోదు చేశారని కేటీఆర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.  ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కేసును కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.  

Also read :  బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక ఒప్పందాలు!

Also read :  మమ్ముట్టి కోసం పూజలు చేసిన మోహన్‌లాల్.. ఏం జరిగిందంటే?

Advertisment
Advertisment
Advertisment