STUDENTS MISSING : ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థులు ఏం చేశారంటే....

ఆరుగురు గురుకుల విద్యార్థులు కనిపించకుండా పోయిన సంఘటనా సూర్యపేట జిల్లా కోదాడ మండలం లో కలకలం రేపింది. కోదాడ మండలం దోరకుంట సమీపంలోని మునగాల నెమలిపురి ఆర్ఆర్ సెంటర్ లో గల ఎస్సీ గురుకుల పాఠశాలలో 10 తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు.

New Update
STUDENTS MISSING

STUDENTS MISSING

STUDENTS MISSING : ఆరుగురు గురుకుల విద్యార్థులు కనిపించకుండా పోయిన సంఘటనా సూర్యపేట జిల్లా కోదాడ మండలం లో కలకలం రేపింది. కోదాడ మండలం దోరకుంట సమీపంలోని మునగాల నెమలిపురి ఆర్ఆర్ సెంటర్ లో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆదివారం ఉదయం నుంచి కనిపించడంలేదు. దీంతో ఉపాధ్యాయులు చుట్టు పక్కల వెతికి సాయంత్రం వరకు వస్తారనుకొని వేచి చూశారు. సాయంత్రమైన తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఉపాధ్యాయుడు మందలించడం వల్లే విద్యార్థులు బయటకు వెళ్లినట్లు తోటి విద్యార్థులు చెప్పారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.  

Also Read :  తెలంగాణలో మట్కా మాయా జూదం.. ఆన్‌లైన్‌ వీడియోలతో లక్షల్లో టోకరా!

కాగా పదవతరగతి క్లాసులు ముగిస్తుండటం, పరీక్షలు దగ్గర పడుతుండటంతో రెండు రోజుల క్రితం పదవతరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీలో పదిమంది విద్యార్థులు మద్యం సేవించి తోటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులతో గొడవకు దిగినట్లు తెలిసింది. దీంతో టీచర్లు వారిని మందలించారు. అది మనసులో పెట్టుకున్న విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు వారి ఆచూకీ కోసం చుట్టూ పక్కల వెతికారు. అయినా వారి జాడ లేకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఒకవేళ ఇంటికి గానీ వచ్చారా అని ఆరాతీశారు. ఇంటికి కూడా రాలేదని తెలియడంతో మరింత ఆందోళన చెందిన ప్రిన్సిపాల్‌ ఝాన్సీ కోదాడ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ పిల్లలు కనిపించడం లేదని తెలిసి తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థుల కోసం అన్వేషిస్తున్నారు. కుటుంబ సభ్యులను వారికి తెలిసిన బంధు మిత్రుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.


  Also Read :  వ్యవసాయ, తయారీ రంగాల్లో ఇవే టాప్ 10 బడ్జెట్ హైలెట్స్


కాగా విద్యార్థులు  అకారణంగా అల్లరి చేస్తే మందలించడమే తప్పయిందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతుండగా, తమ పిల్లల్ని ఉపాధ్యాయులు కొట్టడం వల్లే వారు బయటకు వెళ్లిపోయారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా సూర్యాపేటలో కనిపించకుండా పోయిన విద్యార్థులు నేరుగా విజయవాడకు చేరుకున్నట్లు తెలిసింది. స్థానిక పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసులు విజయవాడ రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుతున్న విద్యార్థులను ఆదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పూర్తి వివరాలు చెప్పడంతో సూర్యాపేట పోలీసులకు సమాచారం అందించారు.కాగా స్థానిక పోలీసుల సహాకారంతో వారిని విజయవాడ నుంచి సూర్యాపేటకు రప్పించారు.

Also Read :  2025 బడ్జెట్‌లో పొరుగుదేశాలకు ఇండియా ఆర్థిక సాయం.. ఏ దేశానికి ఎంతంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BRS Silver Jubilee Meeting: గులాబీల జెండా పట్టి మల్లేశో.. BRS సభ కోసం రసమయి అదిరిపోయే పాట.. మీరూ వినండి!

బీఆర్‌ఎస్‌ పార్టీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. వరంగల్‌ జిల్లాలోని ఎల్కతుర్తి సమీపంలో ఈ నెల 27న పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనికోసం రసమయి బాలకిషన్ అద్భుతమైన పాట రాసి పాడారు. ఇప్పుడు అ పాట  షోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

New Update
BRS Silver Jubilee

BRS Silver Jubilee

BRS Silver Jubilee : బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. వరంగల్‌ జిల్లాలోని ఎల్కతుర్తి సమీపంలో ఈ నెల 27న పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనికోసం రసమయి బాలకిషన్ అద్భుతమైన పాట రాసి పాడారు. ఇప్పుడు అ పాట  షోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Also Read: Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

కాగా బీఆర్ఎస్ సభ కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో వైపు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆయా జిల్లాల నేతలతో సమావేశమై ఉత్సవాలపై దిశానిర్ధేశం చేశారు. లక్షమందికి మించకుండా సభ నిర్వహించాలని బీఆర్ఎస్‌ భావిస్తోంది. పదేండ్ల తర్వాత అధికారం కోల్పొయిన బీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష పార్టీగా నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో ఈ సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 

Also Read: Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి నుంచి దూకిన పిల్లలు, మహిళలు

రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ 15 నెలల కాలంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ఫెయిల్‌ అయిందని చెప్తున్న బీఆర్ఎస్‌ పార్టీ అధికార కాంగ్రెస్‌ పార్టీ లోపాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఈ సభను గతంలో కంటే భిన్నంగా నిర్వహించాలని భావిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించ ఈ సమావేశంలో పార్టీ ఓటమికి గల కారణాలు, భవిష్యత్తులో పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించి వాటిని ఏ విధంగా అమల్లో పెట్టాలనేది పార్టీ అధినేత దిశా నిర్ధేశం చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాల వారికిగా కమిటీల నిర్మాణ, గ్రామీణ స్థాయికి పార్టీని తీసుకెళ్లడం చేయాలని భావిస్తోంది. అయితే వరంగల్‌ జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉన్నందున సమావేశానికి అనుమతి వస్తుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. సభకు అనుమతి ఇవ్వాలని రెండు సార్లు పార్టీ నాయకులు జిల్లా పోలీస్‌ అధికారులను కలిసి కోరినప్పటికీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. వారం రోజుల్లో అనుమతిపై సమాధానం ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read :  సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తే.. వాళ్లకు అదే ఆఖరి రోజు.. చంద్రబాబు మాస్ వార్నింగ్

ఇక తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా సాంస్కృతిక ఉద్యమంగానే ప్రజల్లోకి వెళ్లింది.ఆట,పాట, మాట అనే కాన్షెఫ్ట్‌తో ఉద్యమం సాగింది. బీఆర్‌ఎస్‌ కూడా మొదటి నుంచి సాంస్కృతిక రంగానికి పెద్ద వేస్తూ వచ్చింది. తెలంగాణ ధూంధాం పేరుతో రసమయి తదితరులు పార్టీకి సాంస్కృతిక సారధ్యం వహించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రసమయిని సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కూడా కేసీఆర్‌ నియమించారు.అలాగే ఉద్యమ కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గౌరవించారు. రసమయికి కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కేసీఆర్‌. కాగా బీఆర్‌ఎస్‌ 25 ఏండ్ల సభ సందర్భంగా రసమయి మరోసారి తన గళానికి పదును పెట్టారు. "గులాబీల జెండా పట్టి..మల్లేశో...గుండెకద్దుకోని రార మల్లేశో...ఓరుగల్లు మహాసభకు మల్లెశో..ఊరువాడ కదలిపోరా మల్లేశో' అంటూ మరసారి తన గళాన్ని వినిపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతోంది. కాగా పోలీసుల అనుమతి లభిస్తే బీఆర్‌ఎస్‌ సభ ఘనంగా జరిగే అవకాశాలున్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Advertisment
Advertisment
Advertisment