TGPSC:  గ్రూప్ –2 ఎగ్జామ్‌ను వాయిదా వేయలేం–హైకోర్టు

తెలంగాణలో గ్రూప్–2 పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. వీటిని వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది.  ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినందువలన వాటిని వాయిదా వేయడానికి కుదరదని తేల్చి చెప్పింది. 

New Update
High Court

గ్రూప్‌-2, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలు ఒకేరోజు ఉన్నందున వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు అభ్యర్థులు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఇప్పుడు పరీక్షలను వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. ఇప్పటికే వాటికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసినందువలన కష్టమని స్పష్టం చేసింది. 

డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణలో గ్రూప్–2 ఎగ్జామ్స్ జరగనున్నాయి. రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నెల 9 నుంచి టీజీపీఎస్సీ వెబ్ సైట్ల నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఇంతకు ముందే అనౌన్స్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 1.30 నుంచి 2.30గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.

Also Read: హైదరాబాద్ ట్రాఫిక్ కోసం హెచ్‌‌– సిటీ

రెండు సెషన్లలో..

ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-I జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ డిసెంబర్ 15, 2024న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య నిర్వహించబడతాయి, పేపర్-II, హిస్టరీ, పాలిటీ మరియు సొసైటీ అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు అంటే డిసెంబర్. 15, 2024. ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్‌తో కూడిన పేపర్-III డిసెంబర్ 1, 2024న ఉదయం 10 నుండి 12.30 గంటల మధ్య, తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటుతో కూడిన పేపర్-IV అదే రోజు అంటే 2024 డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల మధ్య జరుగుతుంది.

Also Read: బంకర్ లో విలువైన వస్తువులు..సిరియా అధ్యక్షుడి ప్రైవేట్ బంకర్ చూశారా?

Also Read: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

Also Read: బంకర్ లో విలువైన వస్తువులు..సిరియా అధ్యక్షుడి ప్రైవేట్ బంకర్ చూశారా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment