Free Chicken: హైదరాబాద్‌లో ఫ్రీగా చికెన్, ఎగ్స్.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా?

బర్డ్ ఫ్లూ వైరస్‌తో ప్రజలు భయాందోలనలో ఉన్నారు. వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చికెన్‌ మేళాలు ప్రారంభమయ్యాయి. తాజాగా హైదరాబాద్ ఉప్పల్‌లో ఈ మేళా ఏర్పాటు చేశారు. అందులో ఫ్రీగా చికెన్, ఎగ్ ఐటెమ్స్‌ పంపిణీ చేశారు. ఇలా 6 చోట్ల మేళాలను నిర్వహించారు.

New Update
Free Chicken and Egg Mela Draws Massive Crowds in Hyderabad Amid Bird Flu Fears

Free Chicken and Egg Mela Draws Massive Crowds in Hyderabad Amid Bird Flu Fears

చికెన్ ప్రియులు గత కొద్ది రోజులుగా నోటికి తాళం వేశారు. బర్డ్ ఫ్లూ భయంతో కనీసం కోడిని కాదు కదా.. కోడి గుడ్డును కూడా తినడం మానేశారు. అమ్మో చికెన్ తింటే ఏమవుతుందో ఏమో.. బర్డ్ ఫ్లూ వైరస్ మాకు కూడా వ్యాపిస్తుందేమో అనే అపోహలో కొంతమంది ఉన్నారు. అయితే ఈ విషయంపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అలాంటిదేమి జరగదని.. చికెన్, గుడ్లు తింటే ఏం కాదని చెబుతున్నారు. 

Also Read: Trump-Musk:మస్క్‌ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్‌ మార్చేసిన ట్రంప్‌!

కానీ ప్రజల్లో మాత్రం ఎక్కడో తెలియని భయం. ఈ క్రమంలోనే చికెన్, గుడ్లు సేల్స్ బాగా పడిపోయాయి. దీంతో చికెన్ వ్యాపారులు బావురమంటున్నారు. పౌల్ట్రీ రైతుల పరిస్థితి అయోమయంలో పడింది. ఈ క్రమంలోనే పౌల్ట్రీ బ్రీడర్స్ కో-ఆర్డినేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్పెషల్‌గా చికెన్ మేళాలు ప్రారంభిస్తున్నారు. 

Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!

చికెన్ మేళాలు

చికెన్ అండ్ గుండ్లు వండి మరీ ప్రజలకు ఫ్రీగా ఇస్తున్నారు. చికెన్‌తో రకరకాల వంటకాలు చేసి పంచిపెడుతున్నారు. ఉడకబెట్టిన చికెన్, గుడ్లతో ఎలాంటి ప్రమాదమూ లేదని చాటి చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో స్పెషల్ చికెన్ మేళా నిర్వహించారు. ఫ్రీగా చికెన్, ఎగ్‌లను వండి ఫ్రీగా ప్రజలకు పంచిపెట్టారు. దీంతో నాన్ వెజ్ ప్రియులు పరుగులు పెట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇలా దాదాపు 6 చోట్ల ఫ్రీ చికెన్, ఎగ్ మేళాలను నిర్వహించారు. ప్రతి చోట 2వేల కిలోల చికెన్, 2వేల గుడ్లతో ప్రజలకు పంపిణీ చేశారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ, ఏపీలోని మరో 250 ప్రాంతాల్లో ఇలాంటి మేళాలు నిర్వహించనున్నారు.

Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana : ఏం మనిషివిరా.. ఆస్తి కోసం తండ్రికి తలకొరివి పెట్టనన్నాడు.. చివరికి కూతురితో

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టడానికి ఓ కొడుకు ముందుకు రాలేదు. దీంతో చేసేది ఏమీ లేక చిన్న కూతురుతో తండ్రి తలకొరివి పెట్టించి అంత్యక్రియలు జరిపించారు.

New Update
son-and-father

son-and-father

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ కొడుకు మానవత్వాన్ని మరిచి పోయాడు. ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టడానికి ఓ కొడుకు ముందుకు రాలేదు.  పద్మావతి కాలనీకి చెందిన మాణిక్యరావు బుధవారం మృతి చెందాడు. అయితే సంప్రాదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే కుమారులే అంత్యక్రియలు జరిపించాల్సి ఉంటుంది.  

ఆస్తి ఇస్తే తప్ప తలకొరివి పెట్టను 

అయితే  ఆస్తి ఇస్తే తప్ప తలకొరివి పెట్టనని స్మశానంలో అడ్డం తిరిగాడు మాణిక్యరావు కొడుకు. కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం తన పేరు మీద రాసి ఇస్తేనే తన తండ్రికి కొరివి పెడతానని పట్టుబట్టాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత చెప్పిన వినలేదు. దీంతో చేసేది ఏమీ లేక మాణిక్యరావు చిన్న కూతురుతో తండ్రి తలకొరివి పెట్టించి అంత్యక్రియలు జరిపించారు బంధువులు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

Advertisment
Advertisment
Advertisment