BIG BREAKING: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తనపై వస్తున్న కొన్ని ప్రతికూల వార్తలపై అత్యంత వ్యూహాత్మకంగా, హుందాగా స్పందించారు. గాంధీ భవన్లో జరిగిన ఒక సమావేశంలో మీడియా ప్రచారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. గత కొద్దిరోజులుగా కొన్ని మీడియా సంస్థల్లో తన నాయకత్వంపై, పీసీసీ మార్పులపై వస్తున్న వార్తలను మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా కొట్టిపారేశారు. ఒక ఛానెల్లో తనపై వ్యతిరేక కథనాలు వచ్చినంత మాత్రాన ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు.
"కొన్ని మీడియా సంస్థలకు కొన్ని సొంత అభిప్రాయాలు, ఎజెండాలు ఉంటాయి. దానికి నేనేం చేయలేను. ఇప్పుడు నాపై వ్యతిరేక వార్తలు రాసిన సదరు ఛానెల్... గతంలో నా గురించి చాలా పాజిటివ్ వార్తలు కూడా ఇచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని నేను చాలా లైట్ తీసుకుంటున్నాను." అని ఆయన వ్యాఖ్యానించారు.తనపై వస్తున్న ఈ వార్తలపై అనవసరంగా స్పందించి వివాదాలు పెద్దవి చేయవద్దని మహేష్ గౌడ్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. "సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే స్వయంగా మాట్లాడుతాను. అప్పటివరకు ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదు" అని ఆయన క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పీసీసీ అధ్యక్షుడిగా తన పనితీరును అటు హైకమాండ్, ఇటు పార్టీ క్యాడర్ నిరంతరం గమనిస్తూనే ఉన్నాయని మహేష్ గౌడ్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. గత 20 నెలలుగా తాను పార్టీ కోసం ఎలా పనిచేశానో, తన పనితీరు ఏంటో అధిష్టానానికి, రాష్ట్ర నేతలకు బాగా తెలుసని ధీమా వ్యక్తం చేశారు. తన లీడర్షిప్ను, పనితీరును క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ మాత్రమే అంచనా వేస్తుందని, కొన్ని మీడియా సంస్థలు కాదని తేల్చి చెప్పారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) దృష్టిలో "తెలంగాణ పీసీసీ ది బెస్ట్" అనే మంచి గుర్తింపు ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇక పీసీసీ మార్పులకు సంబంధించి వస్తున్న ఊహాగానాలపై కూడా ఆయన సూటిగా స్పందించారు. పీసీసీ మార్పు అనేది పూర్తిగా పార్టీ హైకమాండ్ పరిధిలోని అంశమని, దాన్ని అధిష్టానమే చూసుకుంటుందని చెబుతూ ఆ వివాదానికి తెరదించారు. అలాగే గాంధీ భవన్ నిర్వహణపై వస్తున్న అపోహలను తొలగిస్తూ, గాంధీ భవన్ను ఒక ట్రస్ట్ మెయింటైన్ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి, తనపై వస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడా తొందరపడకుండా స్పందించారు. మీడియా సంస్థల అభిప్రాయాలను గౌరవిస్తూనే, పార్టీ అధిష్టానం, క్యాడర్ తనపై ఉంచిన నమ్మకమే తనకు బలమని చాటిచెప్పారు. ఈ స్పందన ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో అనవసర గందరగోళానికి తావులేకుండా చేయడంలో పీసీసీ చీఫ్ సఫలీకృతులయ్యారనే చెప్పాలి.
BIG BREAKING : నాపై తప్పుడు వార్తలు.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన కామెంట్స్!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తనపై వస్తున్న కొన్ని వార్తలపై స్పందించారు. గత కొద్దిరోజులుగా కొన్ని మీడియా సంస్థల్లో తన నాయకత్వంపై, పీసీసీ మార్పులపై వస్తున్న వార్తలను మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా కొట్టిపారేశారు.
PCC Chief Mahesh Goud
BIG BREAKING: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తనపై వస్తున్న కొన్ని ప్రతికూల వార్తలపై అత్యంత వ్యూహాత్మకంగా, హుందాగా స్పందించారు. గాంధీ భవన్లో జరిగిన ఒక సమావేశంలో మీడియా ప్రచారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. గత కొద్దిరోజులుగా కొన్ని మీడియా సంస్థల్లో తన నాయకత్వంపై, పీసీసీ మార్పులపై వస్తున్న వార్తలను మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా కొట్టిపారేశారు. ఒక ఛానెల్లో తనపై వ్యతిరేక కథనాలు వచ్చినంత మాత్రాన ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు.
"కొన్ని మీడియా సంస్థలకు కొన్ని సొంత అభిప్రాయాలు, ఎజెండాలు ఉంటాయి. దానికి నేనేం చేయలేను. ఇప్పుడు నాపై వ్యతిరేక వార్తలు రాసిన సదరు ఛానెల్... గతంలో నా గురించి చాలా పాజిటివ్ వార్తలు కూడా ఇచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని నేను చాలా లైట్ తీసుకుంటున్నాను." అని ఆయన వ్యాఖ్యానించారు.తనపై వస్తున్న ఈ వార్తలపై అనవసరంగా స్పందించి వివాదాలు పెద్దవి చేయవద్దని మహేష్ గౌడ్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. "సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే స్వయంగా మాట్లాడుతాను. అప్పటివరకు ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదు" అని ఆయన క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పీసీసీ అధ్యక్షుడిగా తన పనితీరును అటు హైకమాండ్, ఇటు పార్టీ క్యాడర్ నిరంతరం గమనిస్తూనే ఉన్నాయని మహేష్ గౌడ్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. గత 20 నెలలుగా తాను పార్టీ కోసం ఎలా పనిచేశానో, తన పనితీరు ఏంటో అధిష్టానానికి, రాష్ట్ర నేతలకు బాగా తెలుసని ధీమా వ్యక్తం చేశారు. తన లీడర్షిప్ను, పనితీరును క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ మాత్రమే అంచనా వేస్తుందని, కొన్ని మీడియా సంస్థలు కాదని తేల్చి చెప్పారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) దృష్టిలో "తెలంగాణ పీసీసీ ది బెస్ట్" అనే మంచి గుర్తింపు ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇక పీసీసీ మార్పులకు సంబంధించి వస్తున్న ఊహాగానాలపై కూడా ఆయన సూటిగా స్పందించారు. పీసీసీ మార్పు అనేది పూర్తిగా పార్టీ హైకమాండ్ పరిధిలోని అంశమని, దాన్ని అధిష్టానమే చూసుకుంటుందని చెబుతూ ఆ వివాదానికి తెరదించారు. అలాగే గాంధీ భవన్ నిర్వహణపై వస్తున్న అపోహలను తొలగిస్తూ, గాంధీ భవన్ను ఒక ట్రస్ట్ మెయింటైన్ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి, తనపై వస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడా తొందరపడకుండా స్పందించారు. మీడియా సంస్థల అభిప్రాయాలను గౌరవిస్తూనే, పార్టీ అధిష్టానం, క్యాడర్ తనపై ఉంచిన నమ్మకమే తనకు బలమని చాటిచెప్పారు. ఈ స్పందన ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో అనవసర గందరగోళానికి తావులేకుండా చేయడంలో పీసీసీ చీఫ్ సఫలీకృతులయ్యారనే చెప్పాలి.