ముక్కు నేలకు రాపిస్తా.. ఎవ్వరినీ వదిలి పెట్టా.. జగ్గారెడ్డి కామెంట్స్

కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండు పాళ్యం బ్యాచ్ అయిందని అన్నారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఖైరతాబాద్ పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాపిస్తానని ఫైర్ అయ్యారు.

New Update

బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండు పాళ్యం బ్యాచ్ అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌నీ, సీఎంనీ ఎప్పుడెప్పుడు బద్నాం చేద్దామా అని చూస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగా తాజాగా గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సోషల్ మీడియా దండు పాళ్యం బ్యాచ్ అయిందని అన్నారు. అధికారం పోయే సరికి కేటీఆర్, హరీష్ రావుకు పిచ్చి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంభం పదేండ్లు రాజరిక పాలన అనుభవించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంను బదనం చేయడం టార్గెట్‌గా పెట్టుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా పని చేస్తుందని విమర్శించారు.

ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్

పిజేఆర్ విగ్రహం దగ్గర ఉరికించి కొడతాను

బెవకుఫ్ చేష్టలు చేయకండని మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు చేసిన తప్పులకి కేటీఆర్, హరీష్ రావు మాటలు పడాల్సి వస్తుందని అన్నారు. పాపం కవిత మొన్నటి వరకు జైల్లో ఉండి వచ్చింది కాబట్టి ఆమెను ఏమి అననన్నారు. హరీష్, కేటీఆర్ పాగల్ గాళ్ళు అయ్యారా? అని ప్రశ్నించారు. పోలీస్‌లకు ఫిర్యాదులు ఇవ్వనని.. తాను అనని మాటలను తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని బట్టలు విప్పి పిజేఆర్ విగ్రహం దగ్గర ఉరికించి కొడతానని అన్నారు. కేటీఆర్ ఫోటోలు పెట్టి దుబాయ్ నుండి పోస్టులు చేస్తున్నారని.. ఇది ఏ మంత్రం మంచి పద్దతి కాదని అన్నారు. రాజకీయం ఎలా చేయాలో తెలవదా? ప్రజా సమస్యలు మీద మాట్లాడండని ఫైర్ అయ్యారు. 

ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు!

తప్పుడు పోస్టులు పెట్టిన వాడిని వదలను

అమెరికా, సింగపూర్, దుబాయ్‌లో ఉన్న కాంగ్రెస్ ఎన్ఆర్ఐ, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారిని ఇక్కడకు తీసుకు రండని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక కలెక్టర్ ఆఫిస్‌కి రాలేదని.. ప్రజలను కలవడని.. తాను ఫోన్ చేసినా అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. అందువల్లనే ఆయనను తాను తిట్టినట్లు పేర్కొన్నారు. తాను ఇప్పుడు ఎవరిని తిట్టలేదని అన్నారు. అయినా తన మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు పెట్టారని.. వాడిని వదలని తెలిపారు. ఉద్యమం సమయంలో అధికారులను తిట్టినవు కానీ ఇప్పుడు అనగలుగుతావా హరీష్ రావు, కేటీఆర్ అని మండిపడ్డారు. 

రేవంత్ రెడ్డి, నేను ఫైటర్స్

ఇది కూడా చదవండి:  సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్!

రేవంత్ రెడ్డి, నేను ఫైటర్‌లం అని.. బీఆర్ఎస్ వాళ్ళు ఈ 10 నెలలకే మమ్మల్ని తట్టుకోలేక పోతున్నారని అన్నారు. ఇంకా పదేండ్లు మమ్మల్ని ఎలా తట్టుకుంటావ్ అని ఎద్దేవా చేశారు. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలపై ప్రజలకు మంచి నమ్మకం కలిగిందని అన్నారు. కేటీఆర్ నీకు కొంచెం గౌరవం ఇస్తాను.. కానీ మీ సోషల్ మీడియాను కంట్రోల్ పెట్టమని అన్నారు. రేవంత్ రెడ్డి చిట్టి నాయుడు కాదు గట్టి నాయుడన్నారు. అయితే కేటీఆర్ డబుల్ లుచ్చగాడని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తొడ కొడితే కేటీఆర్ కాళ్ళు వనుకుతాయన్నారు. ఉద్యమ సమయంలో శ్రీ కృష్ణ కమిటీ సంగారెడ్డి వచ్చినప్పుడు హరీష్ రావు మనుషులకు తనకు పెద్ద గొడవ అయ్యిందని.. హరీష్ రావు వచ్చి సముదాయించితే తాను తగ్గానని అన్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ బాధ వేసింది

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం!

తమపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఖైరతాబాద్ పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాపిస్తానని ఫైర్ అయ్యారు. ఎవ్వరినీ వదిలిపెట్టమన్నారు. ఆఖరికి తమపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేటీఆర్, హరీష్ రావును కూడా నిలదీస్తామని హెచ్చరించారు. అదే సమయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసి తనకు బాధ వేసిందన్నారు. ఆయన సీనియర్ నాయకుడని.. నియోజక వర్గంలో కొంత ఇబ్బంది కలిగి ఆయన అలా మాట్లాడి ఉండవచ్చని తెలిపారు.

అయితే ఆయనకు ఉన్న బాధను ఆయన చెప్పాడని.. తమ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. 40 ఏండ్లు పని చేశాడు కాబట్టి బాధ కలిగి ఆయన ఒక మాట అన్నాడనీ పార్టీ భావిస్తోందని తెలిపారు. ఇక్కడ ఇన్‌లు మాత్రమే ఉంటాయని.. ఔట్‌లు ఉండవని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్‌లో నాయకుల ఒపీనియన్ చెపితే వాళ్ళు ఓర్చుకోరని.. కానీ తమ పార్టీలో అలా ఉండదని అన్నారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పవచ్చని తెలిపారు. అయితే శ్రీదర్ బాబు.. జీవన్ రెడ్డి సమస్య పరిష్కారం చేస్తారని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: సీఎం రేవంత్ కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు.. అలా చేశారేంటి?

నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ ముగ్గురు.. ఎందుకు రాలేదన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

New Update

మంత్రివర్గ విస్తరణ అంశం తెలంగాణ కాంగ్రెస్ కు, సీఎం రేవంత్ కు తలనొప్పిగా మారింది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు స్వరం పెంచారు. తమను అడ్డుకుంటున్న వారిపై, హైకమాండ్ తీరుపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సారగ్ రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. వివేక్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ కు మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించాలంటూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరు కాలేదనే అంశం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వంపై అలిగే వీరు హాజరుకాలేదా? అన్న చర్చ సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. నిన్నటి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మంత్రివర్గం విస్తరణను అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీ లైన్‌ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment