కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? :  ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్.. రంగంలోకి సీఎం రేవంత్!

10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పై సీఎం రేవంత్ ఆరా తీశారని తెలుస్తోంది. కమాండ్ కంట్రోల్ లో అత్యవసర సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, రాజకీయాలపై సీఎం మంత్రులతో చర్చించారు. ప్రభుత్వంలో, పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు.

New Update
cm revanth reddy on mla's meeting

cm revanth reddy on mla's meeting

తెలంగాణ కాంగ్రెస్లో పదిమంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది.  జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేతృత్వంలో  వీరంతా  ఓ ఫామ్ హౌజ్ లో  మంతనాలు జరిపినట్లుగా సమాచారం. మంత్రి పొంగులేటి తీరుపై ఈ పదిమంది ఎమ్మెల్యేల అసంతృప్తిగా ఉన్నారని, భవిష్యత్తు కార్యచరణలో భాగంగానే వీరంతా భేటీలో సమాలోచనలు చేసినట్లుగా తెలుస్తోంది. తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండానే మంత్రి పొంగులేటి స్వంతంగా  నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ పది ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే భేటీ అయిన పదిమంది ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్  ఫోన్‌  చేశారని..  కలిసి మాట్లాడుకుందామని వారికి సూచించినట్లుగా తెలుస్తోంది.  

రంగంలోకి సీఎం రేవంత్

సీక్రెట్ గా భేటీ అయిన పది మందిలో నలుగురు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ఫోన్‌ ద్వారా మరో 6 మంది ఎమ్మెల్యేలు వీరికి టచ్‌లోకి వచ్చారని సమాచారం. ఏడాదిలో  పనులు కాకపోవడం మీద వాళ్లు అసంతృప్తిగా ఉన్నారట. బిల్లుల విషయంలో నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని భావిస్తున్నారట.  వ్యవహారం పెద్దదిగా మారితే ప్రభుత్వానికే ప్రమాదామని భావించి సీఎం రేవంత్ స్వయంగా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. 

అందుకే హుటాహుటిన  కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈ భేటీలో ప్రభుత్వ, పార్టీ అంతర్గత వ్యవహారాలు, తాజా రాజకీయాలపై సీఎం వారితో చర్చించారు. ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పై సీఎం రేవంత్ ఆరా తీశారని తెలుస్తోంది. వారితో స్వయంగా తానే మాట్లాడుతానని సీఎం అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పని చేయాలని మంత్రులకు దిశానిర్థేశం చేశారు.  ప్రభుత్వ అంతర్గత అంశాలపై కూడా సఎం చర్చించారు. జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతరాలు లేకుండా చూడాలని మంత్రులకు రేవంత్ సూచించారు. 

ఇటీవల సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోల్‌ అంశం కూడా  రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.  ఏ ప్రభుత్వం మీకు నచ్చిందని పోల్ పెడితే  70 శాతం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా, 30 శాతం కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఓట్లు పడటంతో పార్టీలోని అగ్రనేతలకు మింగుడు పడటం లేదని సమాచారం. ఇదే అంశంపై మాజీ సీఎం. బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్ కూడా వ్యంగంగా స్పందించారు.  రాజకీయాల్లో  కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవ్వడం,   ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభకు ప్లాన్ చేయడం, ఇప్పుడు కాంగ్రెస్ లోని 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా మీటింగ్ పెట్టడం పార్టీ లోని అగ్రనేతలను ఉక్కరిబిక్కిరి చేస్తున్నాయి.  రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Also Read :  నేటి బడ్జెట్ తో ఆ విషయం తేలిపోయింది.. KTR సంచలన వ్యాఖ్యలు!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం ఆయసంతో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు ఎక్స్పైరీ అయిన ఇంజక్షన్‌ను ఇచ్చారు. అది వికటించడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

New Update
Injuction

Expired Injuction

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజక్షన్ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ అసలేం జరిగిందో తేలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్‌రోడ్డు సమీపంలో హైకేర్‌ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

ఆ తర్వాత వైద్యులు అతడికి పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అక్కడున్న వైద్యులు తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని సూచనలు చేశారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఐలయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇలా ఎలా జరిగిందని వైద్యులను నిలదీశారు. 

Also Read: పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

చివరికి ఐలయ్యకు ఇచ్చిన ఇంజక్షన్లను పరిశీలించారు. అయితే ఆ ఇంజక్షన్ మార్చి నెలలోనే ఎక్స్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిసినప్పటికీ కూడా ఇంజక్షన్ ఇవ్వడం ఏంటని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఐలయ్య మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహంతోనే ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా ఇలా ఇంజక్షన్‌లు వికటించి రోగులు మృతి చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

Also Read: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్‌లో పదిమంది!

rtv-news | telangana 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు