ఏడాదిలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు.. శిరీషను అభినందించిన సీఎం రేవంత్!

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఏడాది కాలంలోనే అయిదు ఉద్యోగాలను సాధించిన ఖమ్మం జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం జ్యోతి శిరీషను సీఎం రేవంత్ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని సీఎం ఆకాంక్షించారు.  

New Update
cm-revanth-reddy, shirisha

cm-revanth-reddy, shirisha

ఒకపక్కా అనారోగ్యంతో బాధపడుతూనే ఏడాదిలో ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఖమ్మం జిల్లాకు చెందిన జ్యోతి శిరీషను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఏడాది కాలంలోనే అయిదు ఉద్యోగాలను సాధించిన ఖమ్మం జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం జ్యోతి శిరీషను సీఎం రేవంత్ అభినందనలు తెలియజేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం నుంచి, అందులోనూ రక్తహీనత పెడుతున్న బాధను లెక్కచేయకుండా జీవితంలో విజయం సాధించాలన్న శిరీష పట్టుదల నేటి కాలంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారని సీఎం అన్నారు.  

Also read :  తన ఇంటి కరెంట్ బిల్లుపై ఎంపీ కంగనా రచ్చ..క్లారిఫై చేసిన విద్యుత్ శాఖ

Also Read :  Manchu Manoj: వీడు కన్నప్ప కాదు 'దొంగప్ప'.. మంచు మనోజ్ సంచలన ట్వీట్!

శిరీష ఆత్మవిశ్వాసం గొప్పది

జీవితంలో అనుకున్నది సాధించడానికి, అవరోధాలను లెక్కచేయకుండా, ఎక్కడా ఢీలా పడకుండా ముందడుగు వేసిన చిరంజీవి శిరీష ఆత్మవిశ్వాసం గొప్పదని అన్నారు. ఈ ప్రయాణంలో తల్లిదండ్రులతో పాటు ప్రోత్సహించిన వారు అభినందనీయులు. ప్రజా ప్రభుత్వ కొలువుల పండుగలో ముందడుగు వేసిన శిరీష భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆకాంక్షించారు.  

Also read : Mayawati : మాయావతి మేనకోడలకు వరకట్న,లైంగిక వేధింపులు..!

Also read : ఇది మామూలు ప్లానింగ్ కాదు భయ్యా.. అమెజాన్ ఆర్దర్లతో పగ మాజీ గర్ల్ ఫ్రెండ్ పై ప్రతీకారం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment