CM Revanth: ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం.. అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు.. రేవంత్ శుభవార్త!

ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు.

New Update

సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇదన్నారు. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితుడుని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నియమించిందన్నారు. పంజాబ్ కేసు సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా కొనసాగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో మన వాదనలు వినిపించామన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు!

సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశామన్నారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. న్యాయ నిపుణులను సంప్రదించి వన్ మెన్ కమిషన్ ను ఏర్పాటు చేశామన్నారు. వన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచా తప్పకుండా ఆమోదించామని వివరించారు. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచామన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందన్నారు. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించారు. 
ఇది కూడా చదవండి: BIG BREAKING: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం!

జనగణన పూర్తి కాగానే రిజర్వేషన్ల పెంపు..

వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధిస్తున్నారన్నారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు. రిజర్వేషన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం తమ బాధ్యత అని అన్నారు. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నానని.. ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదని భరోసానిచ్చారు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. బిల్లు ఆమోదానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు