Fire accident : హైవేపై కారులో మంటలు..సంఘటన సమయంలో ఆరుగురు...

కామారెడ్డి మండలం క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే క్రమంగా మంటలు వ్యాపించడంతో కారు మొత్తం దగ్ధమైంది.

New Update
Fire accident

Fire accident

Fire accident  : కామారెడ్డి మండలం  క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది.  క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న స్కార్పియో కారులో మంటలు చెలరేగాయి. కారులో పొగలు రావడాన్ని గమనించి కారును డ్రైవర్‌ నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది,  డ్రైవర్‌ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.

Also Read : మరో నిర్భయ..నోట్లో గుడ్డలు కుక్కి ..కన్న కొడుకుల ముందే తల్లిపై గ్యాంగ్ రేప్!

శనివారం తెల్లవారుజామున క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై స్కార్పియో కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే కారును నిలిపి, అందులో ఉన్న వారందరిని అప్రమత్తం చేశారు. దీంతో అంతా కిందికి దిగిపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. అయితే క్రమంగా మంటలు వ్యాపించడంతో కారు మొత్తం దగ్ధమైంది.

Also read: Drugs: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?

Also read :  నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్తలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.కారు భువనగిరి నుంచి బడాపహడ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయానిస్తున్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు.

Also read :  పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!

Also Read : అయ్యో తల్లి.. నవరాత్రుల కోసం ప్లాన్.. పీరియడ్స్ రావడంతో సూసైడ్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి లభించింది. దీనికి సంబంధించి పర్మిషన్ పత్రాలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి తీసుకున్నారు. 

New Update
ts

BRS

ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది.

 

today-latest-news-in-telugu | brs-party | meeting | warangal 

 

Also Read: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ ఏం ఆడింది మామా..

Advertisment
Advertisment
Advertisment