Bandi Sanjay : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం చేసిన స్కాంలపై రాష్ట్రప్రభుత్వం విచారణ చేస్తూ... మమ్ముల్ని అరెస్ట్ చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు.మీరు చీకటి ఒప్పందాలు చేసుకుని మాపై బురద చల్లుతారా? అని ప్రశ్నించారు. దమ్ముంటే బీఆర్ఎస్ స్కాంలన్నీ సీబీఐకి అప్పగించండి, దోషులందరినీ బొక్కలో వేస్తామని స్పష్టం చేశారు.
Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..
ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుపు తథ్యమని తేల్చేశాయి. కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని నివేదికలివ్వడంతో దిక్కుతోచని ముఖ్యమంత్రి హడావుడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చారని బండి సంజయ్ అన్నారు. ఒకే రోజు 3 జిల్లాల్లో 3 మీటింగ్ల్లో పాల్గొని అబద్దాలాడుతూ, ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డరన్నారు. మరోవైపు గెలిచినా ఓడినా ప్రభుత్వానికి ఢోకా లేదు... నాకేం ఫరఖ్ లేదని బుకాయిస్తున్నడన్నారు. అంత ధీమా ఉంటే ఎన్నికల ప్రచారానికి ఎందుకు వచ్చినట్లు? చరిత్రలో ఇంతవరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఏ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్న దాఖలాల్లేవని ఎద్దేవా చేశారు. ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఎన్నికల్లో పాల్గొంటూ డబ్బు, అధికార బలంతో ఎలాగైనా గెలవాలని చూస్తున్నారని, దీనికితోడు ఓడిపోతే మీ సమస్యలను పరిష్కరించబోనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
Also Read: Champions Trophy: శుభ్ మన్ గిల్ ను వెళ్ళు వెళ్ళు అన్న అబ్రార్
ఇయాల రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కాంలపై మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే... ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా? లేక మేము ఉన్నామా? అనే అనుమానం వస్తోందని ఏద్దేవా చేశారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్రం పరిధిలోనిది. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు స్కాంలు చేసింది రాష్ట్రంలోనే... దొచుకున్న సొమ్మంతా తెలంగాణ ప్రజలదే. విచారణ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమే. కొంత మంది నిందితులను అరెస్ట్ చేసింది ప్రభుత్వమే. లా అండ్ ఆర్డర్ మీ చేతిలో పెట్టుకుని మీరేందుకు అరెస్ట్ చేయలేదని కేంద్రాన్ని నిందించడం చూస్తుంటే నవ్వొస్తుందని బండి అన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు పోతే.... కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా ఆయా స్కాంల సూత్రధారులు తెలంగాణలోనే ఉన్నారు కదా? మరి వాళ్లను ఇన్నాళ్లుగా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు.
ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
అన్ని ఆధారాలున్నాయని చెబుతూ రాధాకిషన్ రావుసహా కొందరు అధికారులను అరెస్ట్ చేసి 10 నెలలకుపైగా జైల్లో ఉంచిన మీరు కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పైకి తిడుతున్నట్లుగా నటిస్తూ కేసీఆర్ కుటుంబంతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. అరెస్ట్ కాకుండా కాపాడుతూ ఆయా కేసులను నీరుగారుస్తున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కాం, కాళేశ్వరం, కేటీఆర్ బామ్మర్థి డ్రగ్స్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని లేఖ రాయండని సూచించారు. ఆయా కేసుల్లో దోషులెవరైనా అరెస్ట్ చేసి బొక్కలో వేయించే బాధ్యత కేంద్రం తీసుకుంటది. రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా న్యాయ స్థానాల ఆదేశాలు లేకుండా సీబీఐ తనంతట తాను విచారణ జరిపే అధికారం లేదని తెలిసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కేంద్రంపై బురద చల్లడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
ఇది కూడా చూడండి: Raja Saab Latest Updates: రాజాసాబ్ కోసం స్టార్ కమెడియన్స్.. ఈసారి థియేటర్స్ దద్దరిల్లాలి
బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ముఖ్యమంత్రి అర్ధ సత్యాలు, అబద్దాలతోనే ప్రజలను మభ్యపెడుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 51 శాతం ఉందని, ఆ సంఖ్యను 46 శాతానికి ఎట్లా తగ్గిస్తారని అసెంబ్లీ సాక్షిగా నాటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావులే చెప్పారు. మరి ఆనాడెందుకు ముస్లిం జనాభా గురించి సీఎం నిలదీయలేదు? రాష్ట్రంలో ఉన్న ముస్లింలలో 80 శాతం మందిని బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసి నిజమైన బీసీ బిడ్డల పొట్టకొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు బండి సంజయ్. బరాబర్ మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తాం. బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించి బీసీ బిల్లు పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మేం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనర్ కుమార్తె
Bandi Sanjay : దమ్ముంటే సీబీఐ విచారణ కోరు...బొక్కలేస్తం..బండి సంజయ్ సంచలన కామెంట్స్
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ అన్నారు.
BANDI SANJAY
Bandi Sanjay : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం చేసిన స్కాంలపై రాష్ట్రప్రభుత్వం విచారణ చేస్తూ... మమ్ముల్ని అరెస్ట్ చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు.మీరు చీకటి ఒప్పందాలు చేసుకుని మాపై బురద చల్లుతారా? అని ప్రశ్నించారు. దమ్ముంటే బీఆర్ఎస్ స్కాంలన్నీ సీబీఐకి అప్పగించండి, దోషులందరినీ బొక్కలో వేస్తామని స్పష్టం చేశారు.
Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..
ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుపు తథ్యమని తేల్చేశాయి. కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని నివేదికలివ్వడంతో దిక్కుతోచని ముఖ్యమంత్రి హడావుడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చారని బండి సంజయ్ అన్నారు. ఒకే రోజు 3 జిల్లాల్లో 3 మీటింగ్ల్లో పాల్గొని అబద్దాలాడుతూ, ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డరన్నారు. మరోవైపు గెలిచినా ఓడినా ప్రభుత్వానికి ఢోకా లేదు... నాకేం ఫరఖ్ లేదని బుకాయిస్తున్నడన్నారు. అంత ధీమా ఉంటే ఎన్నికల ప్రచారానికి ఎందుకు వచ్చినట్లు? చరిత్రలో ఇంతవరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఏ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్న దాఖలాల్లేవని ఎద్దేవా చేశారు. ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఎన్నికల్లో పాల్గొంటూ డబ్బు, అధికార బలంతో ఎలాగైనా గెలవాలని చూస్తున్నారని, దీనికితోడు ఓడిపోతే మీ సమస్యలను పరిష్కరించబోనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
Also Read: Champions Trophy: శుభ్ మన్ గిల్ ను వెళ్ళు వెళ్ళు అన్న అబ్రార్
ఇయాల రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కాంలపై మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే... ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా? లేక మేము ఉన్నామా? అనే అనుమానం వస్తోందని ఏద్దేవా చేశారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్రం పరిధిలోనిది. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు స్కాంలు చేసింది రాష్ట్రంలోనే... దొచుకున్న సొమ్మంతా తెలంగాణ ప్రజలదే. విచారణ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమే. కొంత మంది నిందితులను అరెస్ట్ చేసింది ప్రభుత్వమే. లా అండ్ ఆర్డర్ మీ చేతిలో పెట్టుకుని మీరేందుకు అరెస్ట్ చేయలేదని కేంద్రాన్ని నిందించడం చూస్తుంటే నవ్వొస్తుందని బండి అన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు పోతే.... కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా ఆయా స్కాంల సూత్రధారులు తెలంగాణలోనే ఉన్నారు కదా? మరి వాళ్లను ఇన్నాళ్లుగా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు.
ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
అన్ని ఆధారాలున్నాయని చెబుతూ రాధాకిషన్ రావుసహా కొందరు అధికారులను అరెస్ట్ చేసి 10 నెలలకుపైగా జైల్లో ఉంచిన మీరు కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పైకి తిడుతున్నట్లుగా నటిస్తూ కేసీఆర్ కుటుంబంతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. అరెస్ట్ కాకుండా కాపాడుతూ ఆయా కేసులను నీరుగారుస్తున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కాం, కాళేశ్వరం, కేటీఆర్ బామ్మర్థి డ్రగ్స్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని లేఖ రాయండని సూచించారు. ఆయా కేసుల్లో దోషులెవరైనా అరెస్ట్ చేసి బొక్కలో వేయించే బాధ్యత కేంద్రం తీసుకుంటది. రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా న్యాయ స్థానాల ఆదేశాలు లేకుండా సీబీఐ తనంతట తాను విచారణ జరిపే అధికారం లేదని తెలిసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కేంద్రంపై బురద చల్లడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
ఇది కూడా చూడండి: Raja Saab Latest Updates: రాజాసాబ్ కోసం స్టార్ కమెడియన్స్.. ఈసారి థియేటర్స్ దద్దరిల్లాలి
బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ముఖ్యమంత్రి అర్ధ సత్యాలు, అబద్దాలతోనే ప్రజలను మభ్యపెడుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 51 శాతం ఉందని, ఆ సంఖ్యను 46 శాతానికి ఎట్లా తగ్గిస్తారని అసెంబ్లీ సాక్షిగా నాటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావులే చెప్పారు. మరి ఆనాడెందుకు ముస్లిం జనాభా గురించి సీఎం నిలదీయలేదు? రాష్ట్రంలో ఉన్న ముస్లింలలో 80 శాతం మందిని బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసి నిజమైన బీసీ బిడ్డల పొట్టకొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు బండి సంజయ్. బరాబర్ మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తాం. బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించి బీసీ బిల్లు పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మేం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనర్ కుమార్తె