/rtv/media/media_files/2025/02/27/PA1Dkc75si2RlEwcoST1.jpg)
BRS Leader Harish Rao
కాంగ్రెస్ సర్కార్ అవినీతి, నిర్లక్ష్యంతో 15 నెలల్లోనే 4 ప్రాజెక్టులు కూలిపోయాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయిందన్నారు. సుంకిశాల ప్రాజెక్ట్ కుప్పకూలిందన్నారు. వట్టెం పంపు హౌజ్ జలమయం అయ్యిందన్నారు. SLBC టన్నెల్ కూలిపోయిందన్నారు. ఎన్నికల ప్రచారం ముఖ్యమా? ఎనిమిది మంది ప్రాణాలు కాపాడటం ముఖ్యమా? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జరిగి ఆరు రోజులైనా ఇప్పటికీ రేవంత్ రెడ్డి రాలేదని ఫైర్ అయ్యారు. ఎందుకిత బాధ్యతా రాహిత్యం? అని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ సర్కార్ అవినీతి, నిర్లక్ష్యంతో
— BRS Party (@BRSparty) February 27, 2025
15 నెలల్లోనే 4 ప్రాజెక్టులు కూలిపోయినయ్.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/6AzdihX0bc
ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాలు కాపాడే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆరు రోజులైనా ఇప్పటి వరకు సరైన డైరెక్షన్ ఇవ్వకుండా రేవంత్ సర్కార్ మొద్దు నిద్రలో ఉందన్నారు. ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందా? అని ఫైర్ అయ్యారు. మంత్రులు పొద్దున వస్తున్నారు.. సాయంత్రం పోతున్నారని.. ఇదేమైనా టూరిస్ట్ ప్లేసా? అని ధ్వజమెత్తారు.
ఎన్నికల ప్రచారం ముఖ్యమా?
— BRS Party (@BRSparty) February 27, 2025
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడటం ముఖ్యమా?
ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జరిగి ఆరు రోజులైనా ఇప్పటికీ రాలేదు రేవంత్ రెడ్డి.
ఎందుకిత బాధ్యతా రాహిత్యం?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥 pic.twitter.com/ev4GkOA5rP
ఇంతకంటే ముఖ్యమైన పని రాష్ట్రంలో ఏముంటది? అని అన్నారు. సహాయక చర్యలు జరుగుతున్నాయనీ, కొద్ది రోజులు ఆగి వెళ్లాలని కేసీఆర్ తమకు సూచించారన్నారు. అందుకే ఇప్పటి దాకా సంయమనం పాటించామన్నారు. ఆరు రోజుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. ఆరు రోజుల్లో 8 మంది ప్రాణాలు కాపాటంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది సున్నా పని అంటూ ఫైర్ అయ్యారు. అందుకే తాము ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు వచ్చామన్నారు.
BREAKING: HCU వివాదం.. రేవంత్ సర్కార్ పై సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్
కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Supreme Court Key Comments on HCU Lands
కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జంతువులు షెల్టర్ అక్కడ తిరగడం షాకింగ్గా ఉందని ఉందని తెలిపింది. వారాంతపు సెలవుల్లో 3 రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందకు వచ్చిందని నిలదీసింది. మీరు చెట్లు నరికివేయడం వల్ల అక్కడి జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయని ఈ వీడియోలు కూడా మేము చూశామని తెలిపింది.
చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని చెప్పింది. చెట్లు నరికేందుకు పర్మిషన్ తీసుకోకపోతే అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించింది. అలాగే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని కాపాడాలనుకుంటే నరికివేసిన ఆ 100 ఎకరాల్లో చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో ఓ ప్రణాళికతో రావాలని ఆదేశించింది. చివరికి మే 15కు విచారణను వాయిదా వేసింది.
Vinci Soni Aloysius: డ్రగ్స్ మత్తులో స్టార్ హీరో బలవంతం.. మలయాళ నటి సంచలన ఆరోపణలు!
🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్
Viral Video: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..
Heavy Rains To Andhra Pradesh🔴LIVE : ఏపీకి 5 రోజులు.. భారీ వర్షాలు | Weather Report Today | RTV