Breaking News: కేసీఆర్ క్యాంపు ఆఫీసుకు టులెట్ బోర్డు

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత, గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ కనబడటం లేదని బీజేపీ నాయకులు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్‌ కనిపించడం లేదని ఆరోపించారు.

New Update
KCR

KCR

KCR  : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత, గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ కనబడటం లేదని బీజేపీ నాయకులు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్‌ కనిపించడం లేదని ఆరోపించారు. ప్రజలకు ఏదో చేస్తాడని గెలిపిస్తే గెలిచిన నాటినుంచి ముఖం చాటేస్తున్నాడని వారు ఆరోపించారు. గజ్వేల్ ఎమ్మెల్యే కనబడటం లేదని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయన్ని ముట్టడించిన బిజేపీ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గేటుకు టూలెట్, వాంటెడ్ బోర్డులను అతికించి నిరసన వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రజలు గుర్తున్నారా కేసీఆర్ అంటూ గజ్వేల్ బిజెపి శ్రేణులు నిరసన తెలిపారు.

Also Read: Sudeeksha Konanki: మా కుమార్తె చనిపోయిందని ప్రకటించండి.. సుదీక్ష తల్లిదండ్రుల షాకింగ్‌ రిక్వెస్ట్‌!

కాగా గతంలో మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ పది నెలలుగా కనిపించడం లేదని, వెతికి పెట్టాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పోలీసులకు స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ ఆచూకీని కనిపెట్టి నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి గజ్వేల్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదాకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్‌ మీరెక్కడా? అని ప్రశ్నించారు. వారం రోజుల్లో కేసీఆర్‌ జాడ తెలియకపోతే తామే వెతుకుతామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచి పది నెలలు కావస్తున్నా నియోజకవర్గంలో ఆయన జాడలేదని పేర్కొన్నారు. ప్రజల కాలిలో ముల్లు దిగితే పంటితో తీస్తానని చెప్పి మరిచిపోయారా? అని గుర్తుచేశారు. కేసీఆర్‌ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్‌ ప్రజల మీద ఉందన్నారు. పోలీసులు కేసీఆర్‌ ఆచూకీ చెప్పకపోతే.. తామే కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సకి స్వయంగా వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుంటామని అన్నారు.

Also Read: Ap weather: ఏపీ ప్రజలకు మాడు పగిలే వార్త...ఆ జిల్లాల్లో ఏకంగా 42 డిగ్రీల ఎండ..జాగ్రత్త!

మరోవైపు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుట లేదంటూ పోస్టర్లు సిద్దిపేట జిల్లాలో కలకలం రేపాయి. ఈ మేరకు పోస్టర్లలో ఇలా రాసుకొచ్చారు. పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వయసు 70 ఏళ్లు, వృత్తి.. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడం, అధికారం కోసం ఆరాటం, కుటుంబం కోసం పోరాటం, బాద్యత.. గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు.. గుర్తులను కూడా పేర్కొన్నారు. తెల్లచొక్కా, తెల్లప్యాంట్ నెత్తిపై టోపీ, భయంకరమైన హిందువు, 80వేల పుస్తకాలు చదివిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఎకరాకు రూ.కోటి సంపాదించే వ్యక్తి.. కేసీఆర్ ఆచూకీ తెలిపిన వారికి మంచి బహుమానం కూడా ఉంటుందని రాసుకొచ్చారు. గజ్వేల్‌లో ఈ పోస్టుర్లు సంచలనంగా మారాయి. ఆయన ఆచూకీ తెలిస్తే గజ్వేల్‌ క్యాంపు కార్యాలయంలో తెలపాలని చెప్పారు.

Also Read: Goa University: గోవా యూనివర్సిటీలో ఘోరం.. గర్ల్ ఫ్రెండ్ కోసం పేపర్ లీక్ చేసిన ప్రొఫెసర్: ట్విస్ట్ అదిరింది!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Two rowdy sheeters : ఇద్దరు రౌడీషీటర్లపై నగర బహిష్కరణ వేటు

ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తూ సమాజానికి ప్రమాదకరమైన ఇద్దరు క్రిమినల్స్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ నగర బహిష్కరణ వేటు వేసింది. రాచకొండ కమిషనరేట్‌లో వారు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని  పోలీసు కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.

New Update
Two rowdy sheeters

Two rowdy sheeters

Two rowdy sheeters :   ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తూ సమాజానికి ప్రమాదకరమైన ఇద్దరు క్రిమినల్స్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ నగర బహిష్కరణ వేటు వేసింది. రాచకొండ కమిషనరేట్‌లో వారు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని  పోలీసు కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.

Also Read: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

పోలీసు కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.....రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ పై 19 కేసులు, నాలుగు హత్య కేసులున్నాయి.  మరిన్ని కేసుల్లో అనుమానితుడిగా, నిందితుడిగా ఉన్నాడు. మరో క్రిమినల్ సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోహిన్ 21 కేసులతో పాటు, హత్య, హత్యాయత్నాల కేసులలో అనుమానితుడిగా, నిందితుడిగా నమోదయ్యాడు. ఇద్దరు రౌడీషీటర్లపై సెక్షన్ 261 సిటీ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ  వేటు వేసినట్లు వివరించారు.

Also Read: America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్‌!

Also Read:  America Trump:ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయం: ట్రంప్!

 వీరు తీరు మార్చుకోక పోవడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వీరి చర్యలతో ప్రజలకు ఇబ్బందిగా మారడంతో ఈ ఇద్దరి పై ఆరు నెలల పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్ నుంచి బహిష్కరిస్తూ సీపీ సెక్షన్ సిటీ యాక్ట్ -261 ప్రకారం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరు రానున్న ఆరు నెలల కాలంలో కమిషనరేట్ పరిధిలో కనిపించిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. నగర బహిష్కరణ నిబంధనలను ఉల్లంఘించి కమిషనరేట్ పరిధిలో సంచరిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు.

Also Read: America: హుతీలను ఎలా చంపామో తెలుసా...వీడియో విడుదల చేసిన అగ్రరాజ్యం!

Also Read: America-Ukrain: ఏడు రోజుల్లో దేశాన్ని విడిచి పొండి...!

Advertisment
Advertisment
Advertisment