BIG BREAKING : లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు మృతి!

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాలుడు అర్నవ్(6) మృతి చెందాడు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అర్నవ్ ను వెల్డింగ్‌ మిషన్‌ల సాయంతో నాలుగు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.

New Update
arnav (6)

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాలుడు అర్ణవ్(6) మృతి చెందాడు.  ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. లిఫ్టు ప్రమాదంలో పొత్తి కడుపు నలిగిపోయినట్టుగా తెలిపారు. అలాగే, ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ అయినట్టు వైద్యులు చెప్పారు. దీంతో బాలుడు మృతి చెందినట్లుగా వెల్లడించారు.  పిల్లాడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  

Also read :  సీఎం రేవంత్ తో కోనేరు కోనప్ప భేటీ.. ఆ హామీ ఇస్తేనే పార్టీలో ఉంటానని కండీషన్?

తాతతో కలిసి తన మేనత్త ఇంటికి

మాసబ్‌ట్యాంక్‌ శాంతినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌లో అర్ణవ్ ఇరుక్కుపోయాడు. తన తాతతో కలిసి తన మేనత్త ఇంటికి వెళ్లాడు అర్ణవ్.  తాత, మనవడు లగేజీతో లిఫ్టు వద్ద ఉండగా.. ముందుగా లోపలికి అర్ణవ్ వెళ్లాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టి..  మిగిలిన లగేజీని తెచ్చేందుకు  బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో అర్ణవ్‌ బటన్‌ నొక్కాడు. దీంతో క్షణాల్లో లిఫ్టు కదిలి పైకి వెళ్లింది. లిఫ్టు గ్రిల్స్‌ తెరిచే ఉండటంతో బాలుడు లిఫ్టు నుంచి దూకాడు. 

Also read :  Maha Sivaratri 2025: మహాశివరాత్రి ఈ 5 పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు ఉండవు

దీంతో లిఫ్ట్‌- స్లాబ్‌ల మధ్య అర్ణవ్ ఇరుక్కుపోయాడు.  దీంతో బాలుడి కేకలు విన్న అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బందికి, హైడ్రా డీఆర్‌ఎఫ్‌ బలగాలను పోలీసులు రప్పించారు.  వెల్డింగ్‌ మిషన్‌ల సాయంతో దాదాపుగా నాలుగు గంటల పాటు శ్రమించి బాలుడ్ని బయటకు తీశారు. అప్పటికే అర్ణవ్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది.  వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అర్ణవ్ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచాడు.  అర్ణవ్ మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

Also Read :  405 రోజులు...10 దేశాలు...41 లక్షల రూపాయలు..చేరిన గమ్యం..కానీ అంతలోనే!

Also read :   Maha Sivaratri 2025: మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా?.. అయితే.. ఈ విషయం మీ కోసమే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment