ధరణికి గుడ్‌బై.. ఇక నుంచి భూమతే!

తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్లేస్‌లో భూమాత తీసుకురావాలని నిర్ణయించింది. సచివాలయంలో సోమవారం కేబినెట్ భేటిలో కొత్త ఆర్ఓఆర్, భూమాత పోర్టల్ గురించి చర్చించారు. వీటికి మంత్రివర్గ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు.

New Update
bhoomatha

తెలంగాణ ప్రభుత్వం భూరికార్డుల కోసం ధరణి స్థానంలో భూమాతను తీసుకురావాలని నిర్ణయించింది. అలాగే రెవెన్యూ విధానంలో మార్పులు చేస్తూ.. ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదా బిల్లును తయారు చేసింది. సోమవారం మంత్రివర్గం సచివాలయంలో భేటి అయి ఆర్ఓఆర్ చట్టం 2024కు ఆమోదం తెలిపింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కొత్త ఆర్ఓఆర్ చట్టం గురించి కేబినెట్ సమావేశంలో వివరించారు. ఆ చట్టంపై అసెంబ్లీలో చర్చ అనంతరం గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు.

Also read: సోనియా గాంధీ తీసుకున్న నెహ్రూ లేఖలు అప్పగించండి: కేంద్రం

Also Read: మసీదులో జైశ్రీరాం అంటే తప్పేంటి..సుప్రీంకోర్టు ప్రశ్న

కొత్త ఆర్ఓఆర్ చట్టంలో భాగంగా ప్రస్తుతం ఉన్న ధరణి సైట్‌లో అనేక మార్పులు తీసుకురానున్నారు. ధరణికి బదులు భూమాత ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ధరణి‌ పోర్టల్లో 33 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ ఉపయోగిస్తారు. అయితే ధరఖాస్తు టైంలో ప్రాబ్లమ్ ఒకటై.. మాడ్యూల్ సెలెక్ట్ చేసే సమయంలో వేరే దాన్ని ఎంచుకుంటే ఆ ధరఖాస్తునే తిరస్కరిస్తున్నారు. ఆర్ఓఆర్ కొత్త చట్టంలో మాత్రం ఏ మాడ్యూల్లో ధరఖాస్తు చేసినా భూవివాధాలు పరిష్కరించడానికి వీలుగా ఉంటుంది. ధరణిలో ఉన్న ఎక్కువ మాడ్యూల్స్ భూమాతలో 14 మాడ్యూల్స్‌కు కుదించినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మంగళవారం దారుణం జరిగింది. ఓ మహిళపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్‌ వైపు తన కూతురుతో కలిసి స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

New Update
Accident

Accident

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మంగళవారం దారుణం జరిగింది. ఓ మహిళపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్‌ వైపు తన కూతురుతో కలిసి స్కూటీపై వెళ్తోంది. అయితే గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్‌ ఎదుటు స్కూటీ అదుపుతప్పడంతో ఇద్దరు కింద పడ్డారు. ఆ మహిళ తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

ఇటీవలే హైదరాబాద్‌లోని ఇలాంటి ఘటనే జరిగింది. బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ ఓ వాహనాదారుడు మృతి చెందాడు. ఈనెల 13వ తేదీన ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. అయితే బైక్ అదుపు తప్పింది. దీంతో వాహనాదారుడు కిందపడ్డాడు. ఇదే సమయంలో వచ్చిన ఒక్కసారిగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లింది. 

Also Read: జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

దీంతో ఆ బైక్ వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడని వాహనాదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వాళ్లని చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  

Also Read: మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!

 rtc-bus | telugu-news | telangana | hyderabad 

Advertisment
Advertisment
Advertisment