Bhadrachalam : భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు.. !

భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులపై లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. అదనపు కట్నంతో పాటు, లైగింకంగా వేధిస్తున్నారంటూ ఆయన దత్తపుత్రుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

author-image
By Bhavana
New Update
bdr

Bhadrachalam : భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకుడిగా చేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యుల పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో ఆయనపై ఆలయ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. తన కోడలిపైనే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఏపీలోని తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో కోడలు కేసు పెట్టింది. 

అయితే ఈ విషయాన్ని ఆలయ అధికారులకు తెలియకుండా దాచిపెట్టినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు 14న తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆలయ అర్చకుడి కోడలు స్వయంగా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. గతకొంతకాలంగా తన మామే లైంగిక దాడికి పాల్పడుతున్నారని, అత్త తోపాటు,భర్త, ఆడపడుచులు కుటుంబ సభ్యులు కూడా వేధింపులకు గురిచేశారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రూ.10 లక్షల కట్నం కోసం వేధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఏపీలో కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణలో చర్యలు తీసుకున్నారు. భద్రాది ఆలయ ప్రధాన అర్చకుడితోపాటు ఆయన దత్తపుత్రుడిని తెలంగాణ దేవాదాయ శాఖ అధికారులు వారి పై సస్పెన్షన్‌ వేటు వేశారు. కేసు నమోదైన క్రమంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన పోలికతోనే ఓ వారసుడిని ఇవ్వాలని కోడలిపై వేధింపులు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదు లో తెలిపింది.

దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ మేరకు భద్రాది ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులతో పాటు దత్తపుత్రుడు, ఆలయ అర్చకుడు పొడిచేటి తిరుమల వెంకట సీతారాంలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు.

అయితే ఈ విషయం గురించి స్పందించిన ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యలు తమ కుటుంబంలోని కలహాలను అనుకూలంగా చేసుకొని దేవాదాయ శాఖ కార్యనిర్వాహక విభాగం తనను మానసిక వేదనకు గురిచేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. సీతారామానుజాచార్యులు ఆలయ మాడ వీధుల విస్తరణలో భాగంగా దేవస్థానం ఆలయాన్ని ఆనుకుని ఉన్న తన ఇంటిని కూల్చివేయాలని యత్నిస్తోందని ఆరోపిస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులు అందకు తాను ఒప్పుకోకపోవడంతోనే లేని పోని అభాండాలను వేస్తూ బాధ్యతల నుంచి తప్పించారని ఆయన ఆరోపించారు.

తన భార్య వేరు కాపూరం పెట్టాలని ఒత్తిడి చేస్తోందని అందుకు ఒప్పుకోకపోవడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యి కేసుల వరకు వెళ్లాయని అర్చకుడు సీతారాం చెబుతున్నాడు.

Also Read: Nagababu: జానీ మాస్టర్ నిర్దోషి!.. నాగబాబు సంచలన ట్వీట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్‌..

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలుకు మరో ముందుడుగు పడింది. ఈ బిల్లుకు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. త్వరలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యేలా రేవంత్ సర్కార్ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

New Update
Jishnu Dev Vrama

Jishnu Dev Varma

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలుకు మరో ముందుడుగు పడింది. ఈ బిల్లుకు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గంలో 3 గ్రూపులుగా ఉప కులాలను విభజించి 15 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఈ బిల్లు రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ బిల్లుకు చట్టబద్ధత ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించారు. దీంతో మంగళవారం జిష్ణుదేవ్ వర్మ ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. అయితే రేవంత్ ప్రభుత్వం త్వరలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఏపీ & తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. భారీ భూకంపం!

గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఒక్కో అడుగు ముందుకెస్తున్న రేవంత్ ప్రభుత్వానికి గవర్నర్‌ నుంచి కూడా ఆమోదం లభించింది. దీనివల్ల ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు కానుంది.  గతేడాది ఆగస్టు 1న ఎస్సీ వర్గీరణకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వడంతో అదే రోజున సీఎం రేవంత్ దీనిపై స్పందించారు. వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటన చేశారు.

Also Read: రేప్ కేసులో ట్విస్ట్.. అంతా ఆమె ఇష్టపూర్వకంగానే జరిగిందని నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

 దీంతో 2024 సెప్టెంబర్ 12న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ ఉప సంఘాన్ని నియమించారు. విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాత వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిషన్‌ను నియమించాలని ఉపసంఘం సిఫార్సు చేసింది. దీనిపై విస్తృత అధ్యయనం పూర్తయ్యాక ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఉపసంఘానికి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కేబినెట్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. అన్ని పార్టీలు దీనికి మద్దతు తెలిపాయి. 

Also Read: కంచ గచ్చిబౌలి భూవివాదం సెంట్రల్ కమిటీ హైదరాబాద్‌లో వారితో భేటి

sc-classification | telugu-news 

Advertisment
Advertisment
Advertisment