Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య

ములుగుజిల్లా వాజేడు మండలంలో గిరిజన యువకుడి హత్య సంచలనం సృష్టించింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ హత్య గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

New Update
murder

murder

Murder : ములుగు జిల్లా వాజేడు మండలంలో గిరిజన యువకుడి హత్య సంచలనం సృష్టించింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర ఘటన గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది.విజయ్‌ తన ఇంటి సమీపంలో ఉన్న సమయంలో, గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై అకస్మాత్తుగా దాడి చేసినట్లు తెలుస్తోంది. విజయ్ తలపై గొడ్డలితో దాడిచేసి అతన్ని అతి దారుణంగా హత్య చేశారు. జరిగిన ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయ్ శవాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. సంఘటన స్థలంలో రక్తపు వరదల ప్రవహించడంతో హత్య ఎంత దారుణంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

సమాచారం అందుకున్న వెంటనే వెంకటాపురం సీఐ బండార్ కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కక్ష, పాత వైరం లేదా ఇతర కారణాలు ఈ హత్యకు దారితీసాయా అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈ హత్యతో టేకులగూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు భయభ్రాంతులకు లోనయ్యారు. మృతుడు విజయ్‌కు గ్రామంలో మంచి పేరు ఉందని, అతడు ఎవరితోనూ గొడవపడే స్వభావం లేనివాడని స్థానికులు చెబుతున్నారు. అతని హత్యపై పలు అనుమానాలు వెలువడుతున్నాయి. 

Also read: Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)

పోలీసులు ఈ హత్యకు సంబంధించి కొన్ని కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయ్యే వరకు మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి. ఇప్పటికీ దుండగులెవరు అన్న విషయం తెలియరాలేదు. గ్రామంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ దారుణ హత్యతో ములుగు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాసం విజయ్ మరణం అతని కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. నిందితులు త్వరగా పట్టుబడి కఠిన శిక్షలు పడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also read :  ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు?

Also read :  తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴 BRS Silver Jubilee Meeting Live Updates: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. లైవ్ అప్డేట్స్!

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ హన్మకొండ జిల్లాలలోని ఎల్కతుర్తిలో జరగనుంది. ఈ సభలో కేసీఆర్ రేవంత్ సర్కార్ పై సమర శంఖం పూరించనున్నారు. సభ లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.

author-image
By Nikhil
New Update
BRS Public Meeting Warangal

BRS Public Meeting Warangal

  • Apr 27, 2025 13:48 IST

    ఉప్పల్ బగాయత్ లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి



  • Apr 27, 2025 13:47 IST

    ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు



  • Apr 27, 2025 13:46 IST

    నకిరేకల్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు



  • Apr 27, 2025 13:40 IST

    కీసర టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్



  • Apr 27, 2025 13:34 IST

    ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్



  • Apr 27, 2025 13:32 IST

    మల్కాజ్ గిరి నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు



  • Apr 27, 2025 13:30 IST

    గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు



  • Apr 27, 2025 13:28 IST

    దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో..



  • Apr 27, 2025 13:26 IST

    సూర్యాపేట నుంచి భారీగా బయలుదేరిన కార్యకర్తలు



  • Apr 27, 2025 13:26 IST

    బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవసభకు వెళ్తున్న బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీవో, పోలీసులు

    ఖమ్మం - తిరుమలాయపాలెం వరంగల్ రోడ్డు పై బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవసభకు వెళ్తున్న ప్రైవేటు స్కూలు, కళాశాలల బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీవో, పోలీసులు

    విషయాన్ని తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని ఆర్టీవో, సిబ్బందిపై పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి

    వాహనాలకు అనుమతించకపోతే ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించిన బీఆర్ఎస్ నేతలు

    ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎట్టకేలకు వాహనాలను అనుమతించిన అధికారులు



  • Apr 27, 2025 13:15 IST

    సిర్పూర్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్



  • Apr 27, 2025 13:14 IST

    జగిత్యాలలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డ్యాన్స్



  • Apr 27, 2025 12:34 IST

    బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మల్లారెడ్డి డ్యాన్స్



  • Apr 27, 2025 12:32 IST

    కోదాడ నుంచి సభకు బయలుదేరిన నేతలు



  • Apr 27, 2025 12:27 IST

    సభకు ఏర్పాట్లు పూర్తి



  • Apr 27, 2025 12:26 IST

    గన్ పార్క్ వద్ద నివాళులర్పిస్తున్న బీఆర్ఎస్ నేతలు



  • Apr 27, 2025 12:26 IST

    సభకు బయలుదేరిన ఇబ్రహీంపట్నం కార్యకర్తలు



  • Apr 27, 2025 12:25 IST

    తెలంగాణ భవన్ లో రజతోత్సవ వేడుకలు



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు