Aghori - Sri Varshini: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో

తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు మళ్లీ తెలుగు రాష్ట్రాలకు వస్తానని అఘోరీ సంచనల వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను కాశీలో ఉన్నానని తెలిపింది. తనపై విమర్శలు చేసిన వారెవ్వరినీ వదిలిపెట్టనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.

New Update

అఘోరీ పై వర్షిణీ పేరెంట్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ బిడ్డపై అఘోరీ క్షుద్రపూజలు, వశీకరణం జరిపి తనవైపుకు తిప్పుకుందని వారు ఆరోపించారు. మరోవైపు అఘోరీ డబ్బులు ఆశచూపిందని వర్షిణీ అన్న శ్రీవిష్ణు ఇటీవల ఓ వీడియోలో తెలిపారు. అంతేకాకుండా అఘోరీ బ్యాంక్ అకౌంట్లలో లక్షల రూపాయలు ఉన్నాయని.. వారు తెలిపారు. వీటన్నింటిపై అఘోరీ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తాను ఈ ఆరోపణలపై క్లారిటీ ఇస్తానని.. తన బ్యాంక్ స్టేట్‌మెంట్ సైతం చూపిస్తానంటూ అఘోరీ ఓ వీడియో రిలీజ్ చేసింది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అఘోరీ సంచలన వీడియో

అఘోరీ రిలీజ్ చేసిన వీడియో ప్రకారం.. ‘‘నేను కాశీలో ఉన్నాను. నాపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మా సాధన గురించి మీకు ఏం తెలుసని విమర్శలు చేస్తున్నారు. ఒక మనిషిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.  ఒక సాధకుడ్ని, అఘోరీని హింసిస్తే ఊరుకునేది లేదు. ఎవరెవరు నాపై విమర్శలు.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటాను. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

కాశీ మీద ఒట్టేసి చెబుతున్నా ఎవ్వరినీ వదిలేదు లేదు. నాది ధర్మపోరాటం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. ఎంతమంది అడ్డుకున్నా.. నా పోరాటాన్ని నేను కొనసాగిస్తాను. ఇకనుంచి నా ఉగ్రరూపం చూస్తారు. ఎవ్వరినీ వదిలి పెట్టను. అందరి అంతూ చూస్తాను. నా నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను ప్రస్తుతం కాశీలో ఉన్నాను. త్వరలోనే తెలంగాణ, ఆంధ్రాకు వస్తాను. ’’ అని తెలిపింది. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

(aghori | lady aghori | aghori sri varshini | b tech aghori sri varshini | latest-telugu-news | telugu-news | aghori video)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు

New Update
BRS meeting

BRS meeting

KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

 కాంగ్రెస్ ను తిరస్కరించండి


‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

 నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్


ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

Advertisment
Advertisment
Advertisment