Telangana Politics : టార్గెట్ తెలంగాణ.. తన వ్యూహమేంటో చెప్పేసిన చంద్రబాబు! తెలంగాణ గడ్డపై టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తానని ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. యువకులకు అవకాశం ఇస్తానని.. మరో 30-40 ఏళ్లు పార్టీ ఇక్కడ బలంగా ఉండేలా ఫౌండేషన్ వేస్తానని ప్రకటించారు. By Nikhil 07 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Target Telangana : ఏపీ (Andhra Pradesh) లో ఘన విజయంతో తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై టీడీపీ అధినేత చంద్రబాబు (CM Chandrababu) మళ్లీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీకి ఇక్కడ పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లు ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే స్పష్టం అవుతోంది. గెలిచిన నెల రోజుల్లోపే హైదరాబాద్ (Hyderabad) లో భారీ ర్యాలీ నిర్వహించారు చంద్రబాబు. ఈ రోజు పార్టీ పటిష్టం చేయడం కోసం కీలక నేతలతో చర్చలు జరిపారు. మళ్లీ తెలంగాణలో యాక్టివ్ కాబోతున్నామంటూ సంకేతాలు ఇచ్చారు. ఈ తెలుగు జాతి నాకు ఎంతో ఇచ్చింది.. మళ్ళీ జన్మంటూ ఉంటే, తెలుగు గడ్డ పైనే పుట్టాలని దేవుడిని కోరుకుంటున్నా..#NaraChandraBabuNaidu #TDP #Telangana pic.twitter.com/LLwmWkjYoG — Telugu Desam Party (@JaiTDP) July 7, 2024 తెలంగాణ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు నిర్వహించిన తెలంగాణ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ టీడీపీ (TDP) ని స్థాపించింది ఈ గడ్డపైనే అన్నారు. తెలంగాణ గడ్డపై మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీని పునర్నిర్మిస్తామన్నారు. యువకులకు అవకాశం ఇస్తానని ప్రకటించారు. తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని ప్రకటించారు. ఏపీకి ఒక పాలసీ, తెలంగాణకు ఒక పాలసీ పెట్టనున్నట్లు వెల్లడించారు. రానున్న 30-40 సంవత్సరాలు పార్టీ ఉండేలా ఫౌండేషన్ వేస్తానని చెప్పారు చంద్రబాబు. Also Read : తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే! #hyderabad #ap-cm-chandrababu #tdp #telangana-politics సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి