NEW YEAR: తస్మాత్ జాగ్రత్త.. దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష

న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలు ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపితే.. బండి సీజ్ చేసి, రూ. 10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు.

New Update
NEW YEAR: తస్మాత్ జాగ్రత్త..  దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష

NEW YEAR Celebrations: కొత్త ఏడాది వేడుకల సందర్భంగా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఎక్కడ డ్రగ్స్ సరఫరా, వినియోగం జరిగినా దాడులు ఖాయమని చెప్పారు. ఏదైనా కేసులో ఇరుక్కుంటే ముఖ్యంగా యువత తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకున్న వారవుతారని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ల నిర్వాహ కులు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల యాజ మాన్యాలదేనని సూచించారు. మద్యం సేవించి వాహ నాలతో రోడ్ల మీదకు రావద్దని చెప్పారు. డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ మొత్తంగా విస్తృతస్థాయిలో డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు జరుపుతామన్నారు.

ALSO READ: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్.. రేపే లాస్ట్ !

న్యూఇయర్ నేపథ్యంలో ఇవాళ రాత్రి 8 గంటల నుంచే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేపట్టనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే.. బండి సీజ్ చేసి, రూ. 10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. న్యూఇయర్ వేడుకలు అర్ధరాత్రి ఒంటిగంట దాటాక కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు రాష్ట్ర DGP కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు.

రాత్రి 1 గంటలకు రయ్యిమంటూ మెట్రో పరుగులు...

న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్టు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది. చివరి ట్రిప్ 12 గంటల 15 నిమిషాలకు వివిధ స్టేషన్ల నుంచి బయల్దేరి ఒంటి గంట కల్లా గమ్యస్థానాలను చేరుకోనున్నట్లు వెల్లడించింది. సెక్యూరిటీ వింగ్స్ మెట్రో స్టేషన్లు, మెట్రో రైళ్లలో నిఘాను ముమ్మరం చేయనున్నట్లు వివరించింది. మద్యం తాగిన వారిని, ఇతరులతో అసభ్యకరంగా ప్రవర్తించే వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.

ALSO READత్వరలోనే మెగా డీఎస్సీ.. సీఎం రేవంత్ ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HYD Scam: బంగ్లాదేశ్ లో పుట్టినోళ్లకు హైదరాబాద్ లో బర్త్ సర్టిఫికేట్.. షాకింగ్ స్కామ్ బయటపెట్టిన పోలీసులు!

బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు మనదేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారన్నారు. ఆ చొరబాటుదారులకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇస్తూ వారిని స్థానికులుగా నమ్మిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ పత్రంపై అనుమానంతో తీగ లాగితే డొంక కదిలింది.

New Update
Two Bangladeshi Nationals Arrested in Hyderabad

Two Bangladeshi Nationals Arrested in Hyderabad

HYD Scam: బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు మనదేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారన్న విషయం చాలాసార్లు రుజువైంది. బంగ్లా సరిహద్దుల్లో ఉన్న భద్రత దళాల కన్నుగప్పి మనదేశంలోకి పలువురు ప్రవేశిస్తున్నారు. అలా వచ్చినవారిలో చాలామంది హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారనే విషయం చాలాసార్లు రుజువైంది. అయితే ఆ అక్రమ చొరబాటుదారులకు స్థానిక బర్త్‌ సర్టిఫికెట్‌ ఇస్తూ వారిని స్థానికులుగా నమ్మిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు.బర్త్ సర్టిఫికెట్ పత్రంపై అనుమానంతో తీగ లాగితే డొంక కదిలింది.

ఇది కూడా చదవండి: రాత్రంతా ఏసీ వాడుతున్నారా..అయితే జాగ్రత్త

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం . మహ్మద్‌ హసిబుల్ అనే వ్యక్తి ఢాకా నుంచి అక్రమంగా కోల్‌కతా చేరి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. అయితే ఆయన విషయంలో అనుమానం రావడంతో ఎంక్వయిరీ చేయగా షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. బంగ్లా రాజధాని ఢాకాకు చెందిన ప్రధాన నిందితుడు మహ్మద్ హసిబుల్ నాలుగేళ్ల క్రితం భారత్‌లోకి వచ్చాడు. ఏజెంట్లకు రూ.25 వేలిచ్చి అక్రమంగా పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించాడు. కోల్‌కతాలోని సౌత్రాలో జోవన్ చౌదరి పేరుతో నకిలీ ఆధార్ కార్డు సేకరించాడు. అక్కడే కరాటే శిక్షకుడిగా పని చేస్తూ నెలకు రూ.20 వేల సంపాదనతో జీవనం సాగించాడు. 2023 డిసెంబర్​లో ఫేస్‌బుక్‌లో ఛాటింగ్ ద్వారా హైదరాబాద్‌ మలక్‌పేట్‌కు చెందిన జయా చౌదరితో పరిచయం పెంచుకున్నాడు. తాను కోల్‌కతా పౌరుడినంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. మలక్‌పేటకు మకాం మార్చి ఆన్‌లైన్‌ వస్త్ర వ్యాపారం, ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

ఇదే సమయంలో తనకు  బర్త్‌ సర్టిఫికెట్‌ఇప్పించాలంటూ మలక్‌పేట్‌లోని పాన్‌ దుకాణ యజమాని మహ్మద్ ముఖీద్‌ను మహ్మద్‌ హసిబుల్‌ కోరాడు. అతడు కోల్‌కతా నుంచే వచ్చాడని నమ్మిన పాన్‌షాప్‌ యజమాని, చాదర్ ఘాట్‌లోని డీటీపీ ఆపరేటర్ సాయికిరణ్‌ను పరిచయం చేశాడు. అతడు చంచల్‌గూడలోని రజనీకాంత్‌ను సంప్రదించమని సూచించాడు. రజనీకాంత్‌ ద్వారా నార్సింగి మున్సిపాలిటీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సుధీర్‌కుమార్‌ను మహ్మద్ హసిబుల్ కలిశాడు. రూ.15 వేలు కమీషన్ ఇచ్చి జోవన్ చౌదరి పేరుతో  బర్త్‌ సర్టిఫికెట్‌ పొందాడు. వాటి ఆధారంగా ఓటరు గుర్తింపు కార్డు సైతం సంపాదించాడు.  బర్త్‌ సర్టిఫికెట్‌, ఓటరు ఐడీ రెండు ఉండడంతో ఆధార్ కార్డు పొందేందుకు మహ్మద్‌ హసిబుల్‌ సిద్ధమయ్యాడు.

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

ఇదిలా ఉండగానే 3 నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా చేరి టూరిస్ట్ గైడ్‌గా పని చేస్తున్న రోహన్‌షాతో మహ్మద్‌ హసిబుల్‌కు పరిచయం ఏర్పడింది. తన భార్య గర్భంతో ఉందని సహకరించాలని కోరటంతో రోహన్ షాను హైదరాబాద్‌ రప్పించిన హసిబుల్‌ తన ఇంట్లో వసతి కల్పించాడు. అతడికి నకిలీ ఆధార్ కార్డు ఇప్పించాడు. హసన్‌, రోహన్‌ షా భారత పౌరులుగా చెలామణి అయ్యేందుకు పాస్‌పోర్ట్స్ పొందాలని నిర్ణయించుకొని నకిలీ ఆధార్‌ కార్డులతో దరఖాస్తు చేసుకున్నారు. పోలీసుల పరిశీలనలో అవి నకిలీవిగా తేలటంతో మధ్య మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్ ఖలీల్ పాషా బృందం రంగంలోకి దిగింది. అసలు వారికి ఆ నకిలీ కార్డ్సు ఎలా వచ్చాయి అనే విషయంలో కూఫీ లాగడం మొదలు పెట్టాయి.

ఇది కూడా చదవండి: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా ఇలా తరిమేయండి

బంగ్లాదేశీయుడి నుంచి రాబట్టిన సమాచారంతో పాన్ దుకాణదారుడిని పోలీసులు ప్రశ్నించటంతో మిగిలిన వారి ప్రమేయం వెలుగు చూసింది. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయానికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు, తమకు బర్త్‌ సర్టిఫికెట్‌ కావాలని సుధీర్‌ని కోరటంతో అంగీకరించాడు. దీంతో ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కోసం మలక్‌పేట్‌ పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో నార్సింగి మున్సిపాలిటీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సుధీర్‌ కుమార్‌, ఏజెంట్లు మహ్మదులీజ్‌, టి.సాయికిరణ్‌, రజనీకాంత్‌, బంగ్లా దేశస్థులు మహ్మద్‌ హసిబుల్‌, రోహన్‌ ఉన్నారు. నిందితుల నుంచి 7 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, నకిలీ ఆధార్, ఓటర్‌ గుర్తింపు, బర్త్‌ సర్టిఫికెట్లు, బంగ్లా పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు