TG Job Calendar: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు మూహూర్తం ఫిక్స్!

తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో తాము ఇచ్చిన హామీల ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు.

New Update
Sridhar Babu: పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలమైంది: మంత్రి శ్రీధర్‌బాబు

Sridhar Babu: తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము హామీ ఇచ్చిన విధంగానే త్వరలోనే జాబ్ క్యాలెండర్ (Telangana Job Calendar) రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 (TG Group 1) పరీక్ష కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఇప్పుడు కోడ్ ముగియడంతో ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Delhi: లోక్‌సభ తొలి సమావేశాలు.. ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎంపీ!

ఇక సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్‌ వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నామని, మీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తున్నామని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే హరీష్ రావు పరిస్థితి ఏంటో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. మేము తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం. ఏపీ ఆలోచనలు కాదు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్‌ రావుకు లేదు. వాళ్ల హయాంలో గుర్రాలతో ఆశ వర్కర్స్‌ను తొక్కించారని విర్శలు గుప్పించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment