Telangana Budget 2024: రైతులకు గుడ్ న్యూస్.. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్

తెలంగాణ బడ్జెట్ లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. సన్న రకం వరికి క్వింటాల్‌కు రూ.500 ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ పంట నుంచే ఇది అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

New Update
Telangana Budget 2024: రైతులకు గుడ్ న్యూస్.. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్

Paddy Bonus: తెలంగాణ బడ్జెట్ లో రైతులకు (Farmers) గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. వరికి క్వింటాల్‌కు రూ.500 ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ పంట నుంచే ఇది అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 33 రకాల వరిధాన్యాలను గుర్తించిందని అన్నారు. అవి పండించిన రైతులకు క్వింటాలు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు . దీనివల్ల సాగు విస్తీర్ణం పెరిగి అన్నదాతలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

Also Read: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు