Telangana : నేడు తెలంగాణ బీజేపీ నేతల నామినేషన్లు

తెలంగాణలో ఈరోజుతో నామినేషన్లు ముగియనుంది. ఈ ఆఖరు రోజు తెలంగాణ బీజేపీ అభ్యర్ధులు నలుగురు నామినేషన్లు దాఖలు చేయను, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్న్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు ఇంకా ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు.

New Update
Telangana BJP: సీఎం రేవంత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు బీజేపీ కీలక నిర్ణయం

Telangana BJP :  నేడు నిజామాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాలకు బీజేపీ(BJP) అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ ఎంపీ సీటుకు ధర్మపురి అరవింద్ నామినేషన్ వేయనున్నారు. దీంట్లో సీఎం పుష్కర్ సింగ్ దామి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు. అలాగే బండి సంజయ్(Bandi Sanjay) కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఇక నాగర్ కర్నూల్ పార్లమెంట్‌కు పోతుగంటి భరత్ నామినేషన్ వేస్తారు. ఈ రెండు కార్యక్రమాలకు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, తెలంగాణ(Telangana) బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. టవర్ సర్కిల్ వద్ద సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రసంగించనున్నారు.

పెద్దపల్లి సీటుపై ఉత్కంఠత..

నామినేషన్ల తర్వాత బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. గోమా శ్రీనివాస్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ ఇప్పటివరకు బీఫామ్(B-form) మాత్రం ఇవ్వలేదు. ఇదే సమయంలో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్...కిషన్‌రెడ్డిని కలవడంతో...పెద్దపల్లి టికెట్ ఆయనకే ఇస్తారనే టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా ఈరోజు ఈ విషయం తేలిపోతుంది.

Also Read:Khammam: నేడు రఘురామిరెడ్డి నామినేషన్.. భట్టి, తుమ్మల దూరం !

Advertisment
Advertisment
తాజా కథనాలు