World cup: వరల్డ్ కప్ విజయానికి 13 ఏళ్లు!

 2011 ప్రపంచకప్ ఫైనల్‌ను ఎవరు మర్చిపోగలరు? ఏప్రిల్ 2...భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన తేదీ. ఎంఎస్ ధోని సారథ్యంలో టీమిండియా చరిత్ర సృష్టించిన రోజును సగటు భారత క్రికెట్ అభిమాని మర్చిపోవటం చాలా కష్టం.

New Update
World cup: వరల్డ్ కప్ విజయానికి 13 ఏళ్లు!

2011లో ఇదే రోజున, భారత జట్టు శ్రీలంకను ఓడించి ప్రపంచ కప్ (ICC ప్రపంచ కప్ 2011) గెలుచుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 274 పరుగులు చేయగా, భారత జట్టు 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

MS ధోని సిక్సర్ కొట్టడం ద్వారా జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.  ధోనీ 79 బంతుల్లో అజేయంగా 91 పరుగులు చేయగా, గౌతమ్ గంభీర్ 97 పరుగులతో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. తద్వారా టీమ్ ఇండియా 28 ఏళ్ల తర్వాత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అంతకుముందు 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా. మొదటి లోని భయంకరమైన ఆటగాడు సెహ్వాగ్ వికెట్ ను కోల్పోయింది. ఆతర్వాత సచిన వికెట్ కూడా పడిపోవటంతో భారత ఆటగాళ్లు నిరాశలో ఉండిపోయారు. వారి తర్వాత బ్యాటింగ్ కు దిగిన గంభీర్ 97 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. అదే మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ 91 పరుగులు చేసి చివర్లో సిక్సర్ కొట్టి భారత్‌కు టైటిల్‌ను అందించాడు.

ప్రపంచకప్‌లో 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం లభించకపోవడంతో భారత్ ఖాతా కూడా తెరవని సమయంలో తొలి వికెట్ పడింది. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన గౌతం గంభీర్.. సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. సచిన్ 18 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత శుభారంభాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మార్చడంలో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు