విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి.. అడ్డొచ్చిన తండ్రి, సోదరుడిపై దారుణం

ప్రకాశం జిల్లా అయినముక్కలలో కె.శ్రీనివాసప్రసాద్‌ అనే ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థినిని తన ఇంటికి పిలిపించుకుని లైంగిక దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. ఈ అన్యాయంపై ప్రశ్నించిన ఆమె తండ్రి, సోదరుడిపై దాచి చేయగా నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి.. అడ్డొచ్చిన తండ్రి, సోదరుడిపై దారుణం

Teacher Harassment : ఈ మధ్యకాలంలో పాఠశాలలో పిల్లలకు రక్షణగా ఉండాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా పసిపిల్లపై లైంగిక వాంఛ తీర్చుకునేందుకు క్రూగ మృగాలుగా(Harassment) వ్యవహరిస్తున్నారు. టాయిటెల్ వెళ్లిన ఆడిపిల్లలపై ఆగయిత్యాలకు పాల్పడుతున్నారు. బాత్ రూమ్ లో మలమూత్రం చేస్తున్న అమ్మాయిలను దొంగచాటున ఫోన్ కెమెరాల్లో బంధించి పైచాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటి మరో దారుణమైన ఘటనే ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ టీచర్ అడ్డొచ్చిన అమ్మాయి సోదురుడిపైన దాడిచేయడం కలకలం రేపింది.

ఈ మేరకు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం అయినముక్కలలో శుక్రవారం ఈ ఘటన జరిగగా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దదోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కె.శ్రీనివాసప్రసాద్‌ శుక్రవారం పాఠశాలకు ఒకపూట సెలవు పెట్టారు. అయితే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి తన ఇంటికి పిలిచారు. ఆమె తరగతి గదిలో పుస్తకాలు పెట్టి వెళ్లిన విషయం గమనించిన క్లాస్‌ టీచర్‌.. విద్యార్థిని తండ్రికి ఫోన్‌ చేసి అమ్మాయి ఇంటికి వచ్చిందా అని అడిగారు. అయితే ఇంటికి రాలేదని తెలుసుకున్న తండ్రి కంగారుపడ్డాడు. తన అన్న కుమారుడితో కలిసి పాఠశాలకు వెళ్లారు.

Also read :ECIL : ఈసీఐఎల్ లో 363 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు!

అయితే ఈ క్రమంలోనే ఇరుగుపొరుగు, తోటి విద్యార్థులను వివరాలు అడిగిన ఎవరూ తెలీదనే చెప్పారు. దీంతో గణిత ఉపాధ్యాయుడు సెలవు పెట్టిన విషయం తెలిసుకున్నారు. వెంటనే ఆయన ఇంటికి వెళ్లారు. ఉపాధ్యాయుడు ఇంట్లో తలుపులు వేసుకుని ఉండటంతో తలుపులు కొట్టారు. మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా అని ప్రశ్నిస్తే రాలేదని చెప్పాడు. అనుమానంతో లోపల విద్యార్థిని ఉండటం చూసి ఆయనతో వారు గొడవకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు కత్తితో విద్యార్థిని సోదరుడిపై దాడిచేసి గాయపరిచాడు. తండ్రిపై కూడా దాడిచేసేందుకు వెనకాడలేదు. వెంటనే విద్యార్థిని తండ్రి స్థానికుల సాయంతో ఫిర్యాదు చేయగా.. వెంటనే ఎస్సై అంకమ్మరావు సంఘటన స్థాలానికి చేరకుని ఉపాధ్యాయడు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

ఉగ్రదాడి ముమ్మాటికి భద్రత లోపమేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఫైర్ అయ్యారు. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
 ys sharmila

ys sharmila

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మనం దేశం మీద జరిగిన దాడి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల అన్నారు. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని  ప్రధాని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారని.. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారని అన్నారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కశ్మీర్ కి వెళ్తుంటారన్నారు. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భద్రత లోపమేనని ధ్వజమెత్తారు. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్లు లేనే లేరన్నారు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదన్నారు. ఇంతమంది చనిపోయారు అంటే ప్రభుత్వ లోపమేనన్నారు. ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని అన్నారు. నేడు దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పనిచేయడం లేదన్నారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల మీద పనిచేస్తోందని ఆరోపించారు. 

మోదీకి అధికారంలో ఉండే హక్కు లేదు..

ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. వీళ్ళు దేశానికి చౌకిదార్ కాదు..బీజేపీకి చౌకిదార్లని అన్నారు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు. నిఘా వ్యవస్థ బలం అంతా ప్రధాని మోదీ కోసం పని చేస్తోందన్నారు. దేశ భద్రతను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి కేంద్రం తప్పిదమేనని ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారని.. దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ దేశంలోనే ఇంటర్నల్‌గా భద్రత లేదన్నారు. అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. మోదీ శ్రమ దేశ భద్రత కోసం పెట్టి ఉంటే బయట వాళ్ళు చొరబడే పరిస్థితి లేదన్నారు.

Advertisment
Advertisment
Advertisment