Chandrababu: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. కేబినెట్ పదవులపై కీలక చర్చ! టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఎన్డీయే కూటమి పక్షాల భేటీలో ఆయన పాల్గొననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుతోపాటు కేబినెట్లో ఎక్కువ మంత్రి పదవులు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By srinivas 05 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Delhi: టీడీపీ అధినేత, కాబోయే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. ఉండవల్లి నుంచి రోడ్డు మార్గంలో విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు సాయంత్రం ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరించనుండగా.. ప్రధానంగా టీడీపీ నేతలు కేబినెట్లో ఎక్కువ మంత్రి పదవులు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు కూడా కేంద్రప్రభుత్వంలో టీడీపీకి వచ్చే పదవులపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీకి స్పీకర్ పదవి ఇస్తారని నేషనల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ వాజ్పేయి హయాంలో బాలయోగి స్పీకర్గా పని చేసిన విషయం తెలిసిందే. కాగా ఎన్డీఏ కూటమితో పోత్తు కొనసాగలంటే టీడీపీ డిమాండ్లకు బీజేపీ పెద్దలు తప్పనిసరిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక చంద్రబాబు ఢిల్లీ వెళుతున్న క్రమంలో ఆయన నివాసం వద్ద అభిమానులు సందడి చేశారు. #chandrababu #delhi #nda #tdp సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి