Lok Sabha Elections 2024: కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్‌.. ఓటేసిన సూపర్ స్టార్స్‌..!

చెన్నైలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటులు రజినీకాంత్‌, అజిత్‌, రాధిక, శరత్‌కుమార్‌ ఓటు వేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుటుంబసమేతంగా వచ్చి ఓటేశారు. ఓటు వేసినందుకు గర్వంగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.

New Update
Lok Sabha Elections 2024: కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్‌.. ఓటేసిన సూపర్ స్టార్స్‌..!

Lok Sabha Election Voting: దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది. ఏడు విడతల్లో జరిగే లోక్ సభ ఎన్నికల మొదటిదశ పోలింగ్ కొనసాగుతుంది. సా. 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్ లో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో పోలింగ్ పక్రియ కొనసాగుతోంది. లోక్ సభ పోలింగ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Also Read: నేడు ముఖేశ్‌ అంబానీ బర్త్ డే.. ఆయన లైఫ్ సీక్రెట్స్ గురించి మీకు తెలుసా!

చెన్నైలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటులు రజినీకాంత్‌, అజిత్‌, రాధిక, శరత్‌కుమార్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు సాలిగ్రామంలో చెన్నై సౌత్‌ నుంచి పోటీ చేస్తున్న తమిళిసై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శివగంగలో చిదంబరం ఓటేశారు. మోహన్‌ భగవత్‌ నాగ్‌పూర్‌లో ఓటేశారు.

Also Read: ప్రారంభమైన తొలిదశ లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌

కోయంబత్తూరు బీజేపీ అభ్యర్థి అన్నామలై ఉతుపట్టిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గయ ఆర్జేడీ అభ్యర్థి కుమార్‌ సర్వజిత్‌ ఏకంగా ఆటో రిక్షాలో వచ్చి ఓటేశారు. ధర్మపురి పీఎంకే అభ్యర్థి సౌమ్య అన్బుమణి సైతం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుటుంబసమేతంగా వచ్చి ఓటేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు